బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక కారణాలు శోధించే పనిలో పడ్డారు పోలీసులు. పోస్టు మార్టం రిపోర్టును బట్టి చూస్తే అతను తనకు తానుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లే తెలుస్తోంది. అతడి గదిలో కొన్ని మందులు దొరికినట్లు చెబుతున్నారు. అవి డిప్రెషన్ ట్రీట్మెంట్లో భాగంగా తీసుకుంటున్నవే అని తెలుస్తోంది. అతను ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు. సుశాంత్ కుంగుబాటులో ఉండటానికి కారణం సినీ వ్యవహారాలా.. లేక ప్రేమ వ్యవహారాలా అని పోలీసులు శోధిస్తున్నారు. ఇందులో భాగంగానే సుశాంత్ ప్రస్తుత ప్రేయసిగా చెబుతున్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈమెతో పాటు అంకితా లోఖండే, కృతి సనన్ అనే రెండు పేర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ముగ్గురూ వేర్వేరు సమయాల్లో సుశాంత్తో ప్రేమ బంధంలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే మిగతా ఇద్దరమ్మాయిలతో పోలిస్తే సుశాంత్ సీరియస్గా ప్రేమలో ఉన్నది.. చాన్నాళ్లు రిలేషన్షిప్ నడిపింది అంకిత లోఖండెతోనే అన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. టీవీ సీరియళ్లలో పని చేసే దగ్గర్నుంచి వీళ్లిద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఓ సీరియల్లో కూడా నటించారు. అప్పుడు మొదలైన స్నేహం.. తర్వాత ప్రేమగా మారిందని.. ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారని అంటున్నారు. ఐతే ఏం జరిగిందో ఏమో.. కొంత కాలానికి ఇద్దరూ విడిపోయారు. తర్వాత ‘రాబ్తా’లో కలిసి నటిస్తున్నపుడు కృతి సనన్తో అతడికి ఎఫైర్ ఉన్నట్లుగా రూమర్లు వచ్చాయి. కానీ ఇవి ఎక్కువ రోజు నిలవలేదు. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నపుడు వారి గురించి బాలీవుడ్లో ఇలాంటి రూమర్లు వినిపించడం సర్వ సాధారణం. అలాంటి వార్తలు సినిమా ప్రమోషన్కు పనికొస్తాయని చిత్ర వర్గాలు కూడా లైట్ తీసుకుంటూ ఉంటాయి. ఇది అలాంటిదే కావచ్చన్న సందేహాలున్నాయి. ఐతే రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్గానే ప్రేమలో పడ్డాడని అంటారు. మార్చిలో వీళ్లిద్దరూ కలిసి ఓ జిమ్ బయట కనిపించిన ఫొటో అప్పట్లో వైరల్ అయింది. సుశాంత్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ మీడియా అప్పుడు వార్తలు రాసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఆమెను విచారించే పనిలో పడ్డారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…