బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక కారణాలు శోధించే పనిలో పడ్డారు పోలీసులు. పోస్టు మార్టం రిపోర్టును బట్టి చూస్తే అతను తనకు తానుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లే తెలుస్తోంది. అతడి గదిలో కొన్ని మందులు దొరికినట్లు చెబుతున్నారు. అవి డిప్రెషన్ ట్రీట్మెంట్లో భాగంగా తీసుకుంటున్నవే అని తెలుస్తోంది. అతను ఆరు నెలలుగా డిప్రెషన్లో ఉన్నట్లు చెబుతున్నారు. సుశాంత్ కుంగుబాటులో ఉండటానికి కారణం సినీ వ్యవహారాలా.. లేక ప్రేమ వ్యవహారాలా అని పోలీసులు శోధిస్తున్నారు. ఇందులో భాగంగానే సుశాంత్ ప్రస్తుత ప్రేయసిగా చెబుతున్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈమెతో పాటు అంకితా లోఖండే, కృతి సనన్ అనే రెండు పేర్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ముగ్గురూ వేర్వేరు సమయాల్లో సుశాంత్తో ప్రేమ బంధంలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే మిగతా ఇద్దరమ్మాయిలతో పోలిస్తే సుశాంత్ సీరియస్గా ప్రేమలో ఉన్నది.. చాన్నాళ్లు రిలేషన్షిప్ నడిపింది అంకిత లోఖండెతోనే అన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. టీవీ సీరియళ్లలో పని చేసే దగ్గర్నుంచి వీళ్లిద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఓ సీరియల్లో కూడా నటించారు. అప్పుడు మొదలైన స్నేహం.. తర్వాత ప్రేమగా మారిందని.. ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారని అంటున్నారు. ఐతే ఏం జరిగిందో ఏమో.. కొంత కాలానికి ఇద్దరూ విడిపోయారు. తర్వాత ‘రాబ్తా’లో కలిసి నటిస్తున్నపుడు కృతి సనన్తో అతడికి ఎఫైర్ ఉన్నట్లుగా రూమర్లు వచ్చాయి. కానీ ఇవి ఎక్కువ రోజు నిలవలేదు. ఒక సినిమాలో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నపుడు వారి గురించి బాలీవుడ్లో ఇలాంటి రూమర్లు వినిపించడం సర్వ సాధారణం. అలాంటి వార్తలు సినిమా ప్రమోషన్కు పనికొస్తాయని చిత్ర వర్గాలు కూడా లైట్ తీసుకుంటూ ఉంటాయి. ఇది అలాంటిదే కావచ్చన్న సందేహాలున్నాయి. ఐతే రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్గానే ప్రేమలో పడ్డాడని అంటారు. మార్చిలో వీళ్లిద్దరూ కలిసి ఓ జిమ్ బయట కనిపించిన ఫొటో అప్పట్లో వైరల్ అయింది. సుశాంత్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ మీడియా అప్పుడు వార్తలు రాసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఆమెను విచారించే పనిలో పడ్డారు.
This post was last modified on June 15, 2020 11:07 pm
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…