కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన చిత్రమే `మానాడు`. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రయదర్శన్ హీరోయిన్గా నటించగా.. ఎస్.జె. సూర్య విలన్గా చేశాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. శింబుకు పర్ఫెక్ట్ కంబ్యాక్ చిత్రంగా నిలిచిన మానాడులో ఎస్.జె.సూర్య సైతం అద్భుతమైన నటన కనబరిచి విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నాడు.
అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ఈ మూవీ రీమేక్ రైట్స్ను భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రంలో హీరో ఎవరన్నది హాట్ టాపిక్గా మారగా.. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ, ఇప్పటి వరకు ఎవరి పేరు మీద ఈ రీమేక్ను ప్రకటించలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. టాలీవుడ్కి చెందిన బావ బావమరిది ఈ మూవీ కోసం పోటీ పడుతున్నారట. ఇంతకీ ఆ బావ బావమరిది ఎవరో కాదు రానా దగ్గుబాటి – నాగచైతన్య. వీరిద్దరికీ మానాడు స్టోరి బాగా నచ్చేసిందట. ఈ నేపథ్యంలోనే రానా, చైతులిద్దరూ మానాడు తెలుగు రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారట.
ఇక త్వరలోనే వీరిద్దరిలో ఒకరిని నిర్మాత సురేష్ బాబు ఫైనల్ చేసి.. అధికారికంగా మానాడు తెలుగు రీమేక్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఒరిజినల్ను తెరకెక్కించిన వెంకట్ ప్రభునే తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం.
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…