యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో సరదాగా టూర్స్కి వెళ్లే ఎన్టీఆర్.. షూటింగ్ లేకపోతే ఇంట్లో భార్య పిల్లలతోనే టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. అటువంటి వ్యక్తి కొద్ది రోజుల పాటు ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్`.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించగా.. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కరోనా వ్యాప్తి బీభత్సంగా ఉంది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనేవాడు. అంతేకాదు, కరోనా వల్ల షెడ్యూల్ ఉన్నన్ని రోజులు ఆయన ఇంటికి కూడా వెళ్లేవారు కాదట. ఇద్దరు చిన్నపిల్లలు, భార్య మరియు వయసు పైబడిన తన తల్లి ఉండటం వల్ల షూటింగ్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళితే వారెక్కడ ఇబ్బందుల్లో పడతారా అని చాలా రోజులు ఎన్టీఆర్ హోటల్లోనే ఒంటరిగా గడిపారట.
ఇది కుటుంబ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ.. ఆ టైమ్లో ఎన్టీఆర్ మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డారని టాక్. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. అలియా భట్ హీరోయిన్గా నటించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
This post was last modified on February 12, 2022 12:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…