కర్నాటకలో హిజాబ్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వస్త్రాధారణపై అనుకూల వ్యతిరేక కామెంట్లతో స్థానిక నేతలు మొదలుకొని జాతీయ నాయకుల వరకు తమ వైఖరిని వినిపిస్తుండగా తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ జాబితాలో చేరుతూ సంచలన ట్వీట్ చేశారు.
క్లాస్రూంల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటకలో నిషేధం విధించగా విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఎలాంటి దుస్తులు ధరించాలన్నది విద్యార్ధినుల ఎంపికని, రాజ్యాంగం వారికి ఆ హక్కును ప్రసాదించిందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.
బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్కు మద్దతుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు.
అయితే, ప్రియాంక ట్వీట్ ను మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిజాబ్ అంశంలోకి బికినీ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు బికినీ వేసుకోవాలని మీరు సూచన చేస్తున్నారా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. అసలు బికినీ అంశం ఎందుకు ప్రస్తావన వచ్చింది? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఇరుకున పడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
This post was last modified on February 9, 2022 7:51 pm
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…