కర్నాటకలో హిజాబ్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వస్త్రాధారణపై అనుకూల వ్యతిరేక కామెంట్లతో స్థానిక నేతలు మొదలుకొని జాతీయ నాయకుల వరకు తమ వైఖరిని వినిపిస్తుండగా తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ జాబితాలో చేరుతూ సంచలన ట్వీట్ చేశారు.
క్లాస్రూంల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటకలో నిషేధం విధించగా విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఎలాంటి దుస్తులు ధరించాలన్నది విద్యార్ధినుల ఎంపికని, రాజ్యాంగం వారికి ఆ హక్కును ప్రసాదించిందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.
బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్కు మద్దతుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు.
అయితే, ప్రియాంక ట్వీట్ ను మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిజాబ్ అంశంలోకి బికినీ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు బికినీ వేసుకోవాలని మీరు సూచన చేస్తున్నారా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. అసలు బికినీ అంశం ఎందుకు ప్రస్తావన వచ్చింది? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఇరుకున పడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తమన్ మ్యూజిక్కుకి తమనే కాంపిటీషన్ కావడం ఏమిటనుకుంటున్నారా. ఇది గతంలో జరిగిందే అయినా ఈసారి మాత్రం కొంచెం స్పెషల్ గా…
ముందు లీకైనట్టే ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం వాయిదా పడింది. జూలై 30 విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు…
టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ…
ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన…
టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…