కర్నాటకలో హిజాబ్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వస్త్రాధారణపై అనుకూల వ్యతిరేక కామెంట్లతో స్థానిక నేతలు మొదలుకొని జాతీయ నాయకుల వరకు తమ వైఖరిని వినిపిస్తుండగా తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ జాబితాలో చేరుతూ సంచలన ట్వీట్ చేశారు.
క్లాస్రూంల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటకలో నిషేధం విధించగా విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఆమె పేర్కొన్న అంశాలు కొత్త చర్చకు తెరలేపాయి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఎలాంటి దుస్తులు ధరించాలన్నది విద్యార్ధినుల ఎంపికని, రాజ్యాంగం వారికి ఆ హక్కును ప్రసాదించిందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.
బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్కు మద్దతుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు.
అయితే, ప్రియాంక ట్వీట్ ను మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హిజాబ్ అంశంలోకి బికినీ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ విద్యార్థులకు బికినీ వేసుకోవాలని మీరు సూచన చేస్తున్నారా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. అసలు బికినీ అంశం ఎందుకు ప్రస్తావన వచ్చింది? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రియాంక ఇరుకున పడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
This post was last modified on February 9, 2022 7:51 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…