Movie News

#SSMB28: ఎన్నాళ్లో వేచిన సినిమా ఎట్టకేలకు…

మహేష్ బాబు-త్రివిక్రమ్‌లది టాలీవుడ్లో క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ కల్ట్ క్లాసిక్‌గా నిలబడిపోయింది. తెలుగు సినిమా చరిత్రల్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటారు. దీని తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. అది కూడా టీవీల్లో, ఓటీటీల్లో గొప్పగా ఆదరణ తెచ్చుకుంది.

ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతుంటారు. ఐతే మహేష్, త్రివిక్రమ్‌ల కలయికలో మరో సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ.. వీరి కాంబినేషన్ సాధ్య పడలేదు. గత ఏడాది వీరు మళ్లీ కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. కానీ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.

ఇందుకు అనేక కారణాలున్నాయి. ఐతే ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీ శ్రీకారం చుట్టుకుంది.గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఐతే మహేష్ బాబు లేకుండానే ఈ వేడుక పూర్తయింది. కరోనా నుంచి ఇటీవలే కోలుకుని విశ్రాంతి తీసుకుంటుండటం, అలాగే సోదరుడు రమేష్ బాబు మరణంతో బాధలో ఉండటంతో మహేష్ ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో మహేష్ భార్య నమ్రత ఈ వేడుకకు హాజరైంది.

అలాగే కథానాయిక పూజా హెగ్డే కూడా ముహూర్త కార్యక్రమంలో పాల్గొంది. దర్శకుడు త్రివిక్రమ్.. నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరుల సమక్షంలో పూజా కార్యక్రమం పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి నెల రోజుల దాకా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ పని పూర్తి చేసి.. వేసవిలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌కు హాజరయ్యే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తున్న తమనే ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు.

This post was last modified on February 3, 2022 2:31 pm

Share

Recent Posts

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

27 minutes ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

2 hours ago

ప్రమోషన్లకు పిలవలేదని హర్టయిన హీరోయిన్

తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…

3 hours ago

ఆదిపురుష్ పోలిక ఇప్పుడు అనవసరం

ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…

3 hours ago

బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కొంప ముంచిందిగా జ‌గ‌న్ స‌ర్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారో.. ఆ ల‌క్ష్యం నెర‌వేర‌కుండానే వెనుదిరిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి…

4 hours ago

లక్కీ భాస్కర్ 2 వస్తాడు… కానీ ఒక షరతు

రెండేళ్ల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ ఓ మోస్తరు అంచనాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్…

4 hours ago