మహేష్ బాబు-త్రివిక్రమ్లది టాలీవుడ్లో క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘అతడు’ కల్ట్ క్లాసిక్గా నిలబడిపోయింది. తెలుగు సినిమా చరిత్రల్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటారు. దీని తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచినప్పటికీ.. అది కూడా టీవీల్లో, ఓటీటీల్లో గొప్పగా ఆదరణ తెచ్చుకుంది.
ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతుంటారు. ఐతే మహేష్, త్రివిక్రమ్ల కలయికలో మరో సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ.. వీరి కాంబినేషన్ సాధ్య పడలేదు. గత ఏడాది వీరు మళ్లీ కలిసి సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. కానీ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది.
ఇందుకు అనేక కారణాలున్నాయి. ఐతే ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్ల హ్యాట్రిక్ మూవీ శ్రీకారం చుట్టుకుంది.గురువారం ఉదయం హైదరాబాద్లో ఈ చిత్రానికి ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఐతే మహేష్ బాబు లేకుండానే ఈ వేడుక పూర్తయింది. కరోనా నుంచి ఇటీవలే కోలుకుని విశ్రాంతి తీసుకుంటుండటం, అలాగే సోదరుడు రమేష్ బాబు మరణంతో బాధలో ఉండటంతో మహేష్ ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో మహేష్ భార్య నమ్రత ఈ వేడుకకు హాజరైంది.
అలాగే కథానాయిక పూజా హెగ్డే కూడా ముహూర్త కార్యక్రమంలో పాల్గొంది. దర్శకుడు త్రివిక్రమ్.. నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరుల సమక్షంలో పూజా కార్యక్రమం పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’కు సంబంధించి నెల రోజుల దాకా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఆ పని పూర్తి చేసి.. వేసవిలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్కు హాజరయ్యే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తున్న తమనే ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు.
This post was last modified on February 3, 2022 2:31 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…