Movie News

అజిత్-టబు.. 22 ఏళ్ల తర్వాత

కొన్ని జంటలు కలిసి ఒక్క సినిమా చేసినా చాలు.. వాళ్ల పెయిర్స్ ఎప్పటికీ అలా గుర్తుండి పోతుంటాయి. అలా ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన జంట అజిత్-టబులదే. వీళ్లిద్దరూ కలిసి 90వ దశకం చివర్లో ‘కండుకొండేన్ కండుకొండేన్’ (తెలుగులో ప్రియురాలు పిలిచింది) అనే సినిమాలో జంటగా నటించాడు.

ఏస్ సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో పాటు చార్ట్ బస్టర్లయ్యాయి. రెహమాన్ కెరీర్లోనే బెస్ట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా దీన్ని చెప్పొచ్చు. అజిత్-టబుల మధ్య వచ్చే ‘ఏమి చేయమందువే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటుంది. ఆ పాట.. సినిమాలో వారి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఇప్పుడు చూసినా మనసును హత్తుకుంటాయి.

అప్పటికి అజిత్ మాస్ హీరో కాదు. ఇలాంటి లవ్ స్టోరీల్లో భలేగా చేసేవాడు. ఇప్పుడంతా మాస్ మాస్ అంటూ ఒక మూసలో సాగిపోతున్నాడు.ఐతే అజిత్-టబు 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి నటించబోతుండటం విశేషం. అజిత్ త్వరలోనే ‘వలిమై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఖాకి’ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ రూపొందించిన సినిమా ఇది. మన యంగ్ హీరో కార్తికేయ ఇందులో విలన్‌గా చేశాడు. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్న చిత్ర బృందం.. మళ్లీ ఓ సినిమా చేయబోతోంది.

అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇందులో అజిత్ మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇది థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందట. ఇందులో అజిత్‌కు జోడీగా టబు నటించనుందట. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించబోతుండటం ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించేదే. హీరోయిన్‌గా అవకాశాలు ఆగిపోయాక అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్‌తో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది టబు.

This post was last modified on January 29, 2022 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

11 minutes ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

1 hour ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

6 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

6 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago