బాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి.. తిరుగులేని స్థాయికి చేరుకున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. అతడి సినీ ప్రయాణం చాలా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.
హోటల్లో చెఫ్గా పని చేసిన కుర్రాడు.. తర్వాత సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకోవడం.. ముందు చిన్న సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడంం.. ఆపై స్టార్ ఇమేజ్ సంపాదించడం.. కాలానుగుణంగా మారుతూ ఘనవిజయాలు అందుకుంటూ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించడం మామూలు విషయం కాదు.
ఇప్పుడు ఇండియన్ ఫిలిం సెలబ్రెటీస్ అందరి కంటే ఎక్కువ ఆదాయం పొందుతూ, అత్యధిక సక్సెస్ రేట్తో కొనసాగుతున్న హీరో అక్షయే. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు భారీగా విరాళాలు అందజేస్తూ తన దాతృత్వాన్ని కూడా చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడతను.
ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ జర్నీకి సంబంధించి ఇప్పుడో ఇన్స్పైరింగ్ స్టోరీ ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే రోజుల్లో ముంబయిలోని జుహు బీచ్కు సమీపంలో అక్షయ్కు ఒక అందమైన బంగ్లా నచ్చి అందులోకి వెళ్లి ఫొటో షూట్ చేద్దామనుకున్నాడు. ఐతే దాని గార్డు అతణ్ని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్షయ్ ఆ బంగ్లా కాంపౌండ్ వాల్ మీదే రకరకాల పోజులిస్తూ ఫొటోలు దిగాడు. వాటిని తన పోర్ట్ ఫోలియోలో పెట్టాడు.
ఆ ఫొటోల్ని అలాగే దాచుకున్న అక్షయ్.. కొన్నేళ్ల కిందట తాను ఫొటోల కోసం ముచ్చటపడ్డ బంగ్లాను కొనేశాడు. అది వందల కోట్ల విలువైనది. ఆ బంగ్లాను ఆధునికీకరించిన అక్షయ్.. ఒకప్పుడు తాను ఫొటోలు దిగిన ప్రహరీ గోడను అందంగా తీర్చిదిద్దుకున్నాడు. దాని మీద స్టైల్గా పడుకుని ఫొటోలు కూడా దిగాడు. ఈ రెండు ఫొటోల్ని కలిపి చూస్తే అంతకుమించిన ఇన్స్పైరింగ్ స్టోరీ మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు.
This post was last modified on June 13, 2020 2:27 pm
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…