నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘దసరా’ సినిమాపైనే ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు నాని. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ వేస్తున్నారట. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నాని సినిమా మొత్తం బడ్జెట్ ముప్పై కోట్లలోపే ఉండేలా చూసుకుంటారు. అలాంటి ‘దసరా’ సినిమాలో ఒక్క సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ లో చాలా భాగం ఈ విలేజ్ సెట్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…