నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘దసరా’ సినిమాపైనే ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు నాని. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ వేస్తున్నారట. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నాని సినిమా మొత్తం బడ్జెట్ ముప్పై కోట్లలోపే ఉండేలా చూసుకుంటారు. అలాంటి ‘దసరా’ సినిమాలో ఒక్క సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ లో చాలా భాగం ఈ విలేజ్ సెట్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 25, 2022 7:42 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…