నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘దసరా’ సినిమాపైనే ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు నాని. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ వేస్తున్నారట. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నాని సినిమా మొత్తం బడ్జెట్ ముప్పై కోట్లలోపే ఉండేలా చూసుకుంటారు. అలాంటి ‘దసరా’ సినిమాలో ఒక్క సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ లో చాలా భాగం ఈ విలేజ్ సెట్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 25, 2022 7:42 pm
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…