నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గానే ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం ‘దసరా’ సినిమాపైనే ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసతో మాట్లాడనున్నారు నాని. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ వేస్తున్నారట. అది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నాని సినిమా మొత్తం బడ్జెట్ ముప్పై కోట్లలోపే ఉండేలా చూసుకుంటారు. అలాంటి ‘దసరా’ సినిమాలో ఒక్క సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెడుతుండడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఇంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెట్ కోసం తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి చాలా రకాల చెట్లను తెప్పిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ లో చాలా భాగం ఈ విలేజ్ సెట్ లోనే చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 25, 2022 7:42 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…