ఊ అంటావా ఊ ఊ అంటావా మావా అంటూ సమంత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హస్కీ వాయిస్తో గమ్మత్తుగా సాగే ఈ పాటకి సమంతే హైలైట్ అనడంలో సందేహమే లేదు. యూట్యూబ్లో అత్యంత ఎక్కువ మంది చూసిన వీడియోల లిస్టులో మొదటి స్థానంలో నిలిచిందంటే ఈ సాంగ్ ఎంతగా ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు.
అసలు పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోందన్న వార్తే ఆమె అభిమానుల్లో జోష్ని నింపేసింది. బన్నీ ఫ్యాన్స్ని సైతం సంతోషంలో ముంచింది. అయితే లిరికల్ సాంగ్ రిలీజయ్యాక సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. సమంత వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ కొందరు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. కావాలనే ఇలాంటివి చేస్తోందని, తనకిదంతా అవసరమా అని ఏవేవో అన్నారు. కానీ ఆ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్లో నెగిటివ్ వైబ్స్ అన్నీ కొట్టుకుపోయాయి.
సాంగ్ షూట్ చేసేటప్పుడు సమంత ఎంత మథనపడిందో బన్నీ చెప్పాక.. ఎంత ఎఫర్ట్ పెట్టి డెడికేషన్తో డ్యాన్స్ చేసిందో టీమ్ అంతా పదే పదే చెప్పి పొగిడాక సీన్ మొత్తం మారిపోయింది. ఆమెపై ప్రశంసల జల్లు కుదిరింది. ఆ హుషారులో సామ్ మరో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’లో ఓ స్పెషల్ సాంగ్లో ఆడి పాడనుందట సమంత. పూరి సినిమాల్లో కచ్చితంగా ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. దాని కోసం ఎవరెవరినో తీసుకొస్తుంటాడు పూరి. కానీ ‘ఊ అంటావా’ పాట చూశాక సమంతతోనే చేయించాలని ఫిక్సయ్యాడట. ‘మహానటి’లో కలిసి నటించారు కాబట్టి విజయ్ కూడా సామ్తో దీని గురించి మాట్లాడాడని, ఆ చనువుతోనే ఆమె కూడా ఓకే అన్నదని చెప్పుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ సమంత నిజంగా ఊ అందో లేదో క్లారిటీ రాదు.
This post was last modified on January 24, 2022 11:48 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…