ఊ అంటావా ఊ ఊ అంటావా మావా అంటూ సమంత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హస్కీ వాయిస్తో గమ్మత్తుగా సాగే ఈ పాటకి సమంతే హైలైట్ అనడంలో సందేహమే లేదు. యూట్యూబ్లో అత్యంత ఎక్కువ మంది చూసిన వీడియోల లిస్టులో మొదటి స్థానంలో నిలిచిందంటే ఈ సాంగ్ ఎంతగా ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు.
అసలు పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోందన్న వార్తే ఆమె అభిమానుల్లో జోష్ని నింపేసింది. బన్నీ ఫ్యాన్స్ని సైతం సంతోషంలో ముంచింది. అయితే లిరికల్ సాంగ్ రిలీజయ్యాక సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. సమంత వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ కొందరు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. కావాలనే ఇలాంటివి చేస్తోందని, తనకిదంతా అవసరమా అని ఏవేవో అన్నారు. కానీ ఆ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్లో నెగిటివ్ వైబ్స్ అన్నీ కొట్టుకుపోయాయి.
సాంగ్ షూట్ చేసేటప్పుడు సమంత ఎంత మథనపడిందో బన్నీ చెప్పాక.. ఎంత ఎఫర్ట్ పెట్టి డెడికేషన్తో డ్యాన్స్ చేసిందో టీమ్ అంతా పదే పదే చెప్పి పొగిడాక సీన్ మొత్తం మారిపోయింది. ఆమెపై ప్రశంసల జల్లు కుదిరింది. ఆ హుషారులో సామ్ మరో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’లో ఓ స్పెషల్ సాంగ్లో ఆడి పాడనుందట సమంత. పూరి సినిమాల్లో కచ్చితంగా ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. దాని కోసం ఎవరెవరినో తీసుకొస్తుంటాడు పూరి. కానీ ‘ఊ అంటావా’ పాట చూశాక సమంతతోనే చేయించాలని ఫిక్సయ్యాడట. ‘మహానటి’లో కలిసి నటించారు కాబట్టి విజయ్ కూడా సామ్తో దీని గురించి మాట్లాడాడని, ఆ చనువుతోనే ఆమె కూడా ఓకే అన్నదని చెప్పుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ సమంత నిజంగా ఊ అందో లేదో క్లారిటీ రాదు.
This post was last modified on January 24, 2022 11:48 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…