ప్రభాస్ కొత్త సినిమా ఒకదాని గురించి ఇప్పుడు ఉన్నట్లుండి టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది ప్రభాస్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన ‘రాధేశ్యామ్’ గురించి కాదు. షూట్ అవగొట్టేసిన ‘ఆదిపురుష్’ గురించీ కాదు. సగం పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ మూవీ ‘సలార్’ గురించి కూడా కాదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవలే మొదలైన ‘ప్రాజెక్ట్ కే’.. వచ్చే ఏడాది చేయాల్సిన ‘స్పిరిట్’.. ఈ రెండింటి గురించి కూడా కాదు. ఇన్ని సినిమాలను లైన్లో పెట్టిన అతను.. కొత్తగా ఇంకో సినిమాను తెరపైకి తీసుకొస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
యువ దర్శకుడు మారుతితో ‘రాజా డీలక్స్’ అనే సినిమా చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. టైటిల్ కూడా బయటికి రావడంతో ఇది జస్ట్ రూమర్ కాదేమో అనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడీ సినిమా చేయడానికి ఖాళీ ఎక్కడుంది.. అలాగే మారుతితో అతడికి సెట్ అవుతుందా అన్న డౌట్లు కొడుతున్నాయి.
చేతిలో ఉన్న సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేక కిందా మీదా అయిపోతున్నాడు ప్రభాస్. ఒక సినిమా ప్రభావం ఇంకోదానిపై పడుతోంది. అన్నింటికంటే ముందు ప్రకటించిన ‘ప్రాజెక్ట్-కె’ కోసం ప్రభాస్ పెద్దగా పని చేసింది లేదు. ‘రాధేశ్యామ్’ అనుకున్నదానికంటే ఆలస్యమైంది. ఈపాటికి పూర్తి కావాల్సిన ‘సలార్’ కూడా వెనుకబడిపోయింది.
ఇంకోవైపు వచ్చే ఏడాది మధ్యకల్లా సందీప్ రెడ్డి వంగ ఖాళీ అయిపోయి ప్రభాస్తో ‘స్పిరిట్’ తీయడం కోసం ఎదురు చూస్తుంటాడు. మరి చేతిలో ఉన్న ప్రాజెక్టులే ఆలస్యమవుతుంటే.. ఎంత వేగంగా చేసినా సరే రెండు మూడు నెలలు టైం కేటాయించాల్సిన మారుతి సినిమాను ప్రభాస్ ఓకే చేస్తాడా అన్నది డౌట్.
ఇక శిఖర స్థాయికి చేరిన ప్రభాస్ ఇమేజ్ను మ్యాచ్ చేసే సినిమాను మారుతి చేయగలడా అన్న డౌట్ కూడా ఉంది. చివరగా అతడి నుంచి ‘మంచి రోజులు వచ్చాయి’ లాంటి పేలవమైన సినిమా వచ్చింది. అంతకు ముందు అతను తీసిన ‘ప్రతి రోజు పండగే’ కూడా ఓ మోస్తరు సినిమానే.
అతడి సినిమాలు చాలా సింపుల్ గా, లైటర్ వీన్లో ఉంటాయి. ‘బాహుబలి’కి ముందు అయితే ప్రభాస్ ఆ టైపు సినిమాలు చేసినా ఓకే. కానీ ఇప్పుడు అతడి నుంచి అభిమానులు ఆశించే సినిమాల రేంజే వేరు. ఏ కథ చేసినా భారీతనం, ఏవో కొన్ని అద్భుతాలు ఆశిస్తున్నారు. మరి ప్రభాస్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని పెట్టుకుని మారుతి మామూలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే వర్కవుట్ అవుతుందా.. అందులో ప్రభాస్ ఇమడగలడా అనేదే ప్రశ్నార్థకం.
This post was last modified on January 22, 2022 6:11 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…