Movie News

డైరెక్టర్ ని చెడామడా తిట్టేసిన నాగ్!

సీనియర్ హీరో నాగార్జున ఇటీవల ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. సంక్రాంతికి సరైన సినిమాలు లేకపోవడం ‘బంగార్రాజు’కి కలిసొచ్చింది. ఈ వారంలో కూడా పేరున్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి నాగార్జున సినిమాకి మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయం. 

ఇదిలా ఉండగా.. ‘బంగార్రాజు’ సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణను చెడామడా తిట్టేశారట నాగార్జున. ఈ విషయాన్ని కళ్యాణ్ కృష్ణ స్వయంగా ఒప్పుకున్నారు. ఇటీవల ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్నారు కళ్యాణ్ కృష్ణ. ఈ సందర్భంగా అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో నాగార్జున తనను తిట్టిన విషయాన్ని వెల్లడించారు. గతంలో ఈ డైరెక్టర్ నాగచైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఒకరిద్దరి తప్పులను కవర్ చేసినందుకు నాగార్జున తనను పిలిచి.. ‘వారి తప్పులను ఎన్నాళ్లని కవర్ చేస్తావ్.. దానివలన సినిమా రిలీజ్ లేట్ అవుతుంది కదా..’ అంటూ తిట్టేశారట. 

నిజానికి ఆ విషయంలో తన తప్పు లేకపోయినా.. వేరే వాళ్లను కాపాడే క్రమంలో తిట్లు తిన్నానని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ. ఇక ‘బంగార్రాజు’ సినిమా కథ నాగార్జునకి  ఎప్పుడో చెప్పానని.. అది నచ్చి నాగార్జున సినిమా ఎప్పుడు చేసినా.. సంక్రాంతి టార్గెట్ గానే రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారట. అందుకే పరిస్థితులు అనుకూలించకపోయినా.. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేశామని చెప్పారు. 

This post was last modified on January 19, 2022 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?

అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ…

5 minutes ago

రవితేజ విజ్ఞప్తికి విముక్తి

రవితేజ ఇమేజ్‌ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్‌ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా..…

13 minutes ago

రైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరా

ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు…

26 minutes ago

ఖమేనీ మరణం – భారత్ మౌనం వెనుక మర్మమేమిటి?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా,…

2 hours ago

‘పెద్ది’తో పోటీకి సై అంటున్న ‘కర’

ఏప్రిల్ 30 విడుదల తేదీ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు టీమ్ మాత్రం…

2 hours ago

సామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబు

త‌మిళ‌నాడులోని శివ‌కాశీ పేరు దాదాపు అంద‌రికీ సుప‌రిచిత‌మే. దీపావ‌ళి వ‌చ్చిందంటే.. శివ‌కాశీ ప‌టాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్…

3 hours ago