టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో అతడు స్నేహితుడు మాత్రమేనని.. ఇద్దరి ఇష్టాలు కలవడంతో అతడితో ఎక్కువ సమయం కలిసి గడుపుతుంటానని చెప్పింది. కానీ ఈ మధ్యకాలంలో తన రిలేషన్ గురించి ఓపెన్ గానే మాట్లాడుతుంది ఈ బ్యూటీ.
వీరిద్దరూ ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి జీవిస్తున్నారు.
శృతిహాసన్ అప్పుడప్పుడు షేర్ చేసే ఫొటోల్లో, వీడియోల్లో శాంతను కనిపిస్తుంటారు. అయితే అసలు వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారనే విషయాన్ని తాజాగా శృతి చెప్పుకొచ్చింది. శృతికి శాంతను 2018 నుంచి తెలుసట. అయితే అప్పటికి ఆమె మైకేల్ కోర్సలే అనే ఇటాలియన్ సింగర్ తో ప్రేమలో ఉంది. 2019లో మైకేల్, శృతిలకు బ్రేకప్ అయింది.
ఆ సమయంలో శృతి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మళ్లీ తేరుకొని కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అలా కొన్నాళ్లకు శాంతనుతో ప్రేమ మొదలైందట. 2020 ప్రారంభంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మందిరాబేడీ టాక్ షో ‘ది లవ్ లాఫ్ లివ్’లో తొలిసారి శృతి తన లవ్ లైఫ్ గురించి మాట్లాడింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో శాంతనుకి తనే ఫస్ట్ ప్రపోజ్ చేసినట్లు చెప్పింది శృతి.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కనిపించనుంది. అలానే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో శృతిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అలానే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో శృతి పేరు వినిపిస్తోంది.
This post was last modified on January 19, 2022 4:26 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…