Movie News

క‌రోనా వ్యాక్సిన్‌.. మీ ఇష్టం

క‌రోనాను నియంత్రించేందుకు.. ప్రాణ‌హానిని త‌గ్గించేందుకు చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను బ‌లవంతం పెడుతున్నార‌నే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కొంద‌రు కోర్టుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. వ్యాక్సిన్ విష‌యంలో ఎవ‌రినీ బ‌ల‌వంతం పెట్టడం లేద‌ని.. ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్టం ఉంటేనే వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. దేశం లో బలవంతంగా టీకాలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు తమ అభీష్టం మేరకే టీకాను తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

కరోనా టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు సైతం.. అనుమతి లేకుండా చేసే బలవంతపు వ్యాక్సినేషన్ను పేర్కొనడం లేదని తెలిపింది. టీకా ధ్రువపత్రం తప్పనిసరి అనే నిబంధన నుంచి దివ్యాంగులను మినహాయించాలని ఓ ఎన్జీఓ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు స్పందనగా.. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి అన్న నిబంధనను ఇంత వరకు విధించలేదని స్పష్టం చేసింది.

“ప్రస్తుత కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అనేది ప్రజలందరి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన‌ కార్యక్రమం. వివిధ పత్రికలు, మాధ్యమాల ద్వారా దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. టీకా పంపిణీకి చేసిన ఏర్పాట్లు, కావాల్సిన అర్హతలపై వివరాలు తెలియజేస్తున్నాం. అయితే, ఇష్టం లేకుండా ఏ వ్యక్తికీ బలవంతంగా టీకా వేయడం లేదు.“ అని కేంద్ర ప్ర‌భుత్వం త‌న అఫిడవిట్‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

దివ్యాంగులకు టీకా పంపిణీ విషయమై ఎవారా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి టీకా వేసేలా చూడాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే.. దీనిని విచారించిన సంద‌ర్భంగా.. టీకాను బ‌ల‌వంతంగా వేస్తున్నార‌నే వాద‌న‌ల‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్ర‌బుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది. దీంతో మోడీ సర్కారు పై విధంగా స్పందించింది. ఇదిలావుంటే,  భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

43 minutes ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

46 minutes ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

6 hours ago