కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ హీరో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్.. ఇటీవల మరో సినిమా అంగీకరించారు. అదే ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
శేఖర్ కమ్ముల సినిమా ఆలస్యమవుతుండడంతో ముందుగా ‘సార్’ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. రెండురోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ ఇప్పుడు సడెన్ గా తప్పుకున్నట్లు సమాచారం. ధనుష్ లాంటి స్టార్ హీరో.. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ బ్యాకప్ ఉన్నప్పటికీ.. సంయుక్త ఈ సినిమా నుంచి తప్పుకోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే ఈ విషయం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
కానీ సంయుక్త మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకుందని చెబుతున్నారు. ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. మలయాళంలో పదికి పైగా సినిమాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకి ధనుష్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఇక్కడ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడామె ‘సార్’ టీమ్ కి సడెన్ షాకిచ్చింది.
This post was last modified on January 10, 2022 11:14 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…