ఒక హిట్ సినిమా కథను పొడిగిస్తూ సీక్వెల్ తీయడం మామూలే. కానీ ఒకే కథను రెండు భాగాలుగా తీయడం గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం. ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది కమల్ హాసన్. ఆయన తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమా రెండు భాగాలుగా విడుదలైంది. పార్ట్-1 సెన్సేషనల్ హిట్టయి.. రెండో భాగంపై అంచనాల్ని భారీగా పెంచింది. ఐతే ‘విశ్వరూపం’ రిలీజవుతున్నపుడు దీనికి సెకండ్ పార్ట్ ఉందని జనాలకు తెలియదు.
కమల్ కూడా ఆ విషయాన్ని చెప్పలేదు. సినిమాను మధ్యలో ముగించి రెండో భాగం కోసం ఎదురు చూడమన్నాడు. ‘విశ్వరూపం-1’ సూపర్ హిట్టయ్యాక ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా రెండో భాగం కోసం ఎదురు చూశారు. ఐతే రకరకాల కారణాల వల్ల ఆ సినిమా చాలా ఆలస్యమైంది. చివరికి మూడేళ్ల కిందట రిలీజైన ఆ చిత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫస్ట్ పార్ట్కు ఏ రకంగానూ అది సరితూగలేదు.
ఇక ‘బాహుబలి’ విషయానికి వస్తే దీన్ని ఒక సినిమాగా తీద్దామనే మొదలుపెట్టాడు రాజమౌళి. కానీ మధ్యలో ఆయన ఆలోచన మారి రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ పార్ట్ తర్వాత భారీగా పెరిగిన అంచనాలను అందుకుంటూ సెకండ్ పార్ట్ను ఇంకా పెద్ద హిట్ చేయగలిగాడు. ఈ విషయంలో ‘బాహుబలి’ ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత ఇలాగే రెండు భాగాల సినిమాగా ‘కేజీఎఫ్’ వచ్చింది.
ఐతే ముందే ‘చాప్టర్-1’ అంటూ రిలీజ్ చేయడం ద్వారా సెకండ్ పార్ట్ ఉందని సంకేతాలు ఇచ్చారు. ఈ చిత్రం అసాధారణ విజయాన్నందుకుంది. సెకండ పార్ట్ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందనే అంచనాలే ఉన్నాయి. మధ్యలో ‘యన్.టి.ఆర్’ సినిమా సైతం బాహుబలి తరహాలోనే మధ్యలో రెండు భాగాలుగా మారింది. కానీ ఈ ఆలోచన బెడిసికొట్టింది. ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే.. సెకండ్ పార్ట్ దాన్ని మించి డిజాస్టర్ అయింది. ఇప్పుడిక ‘పుష్ప’ రెండు భాగాల సినిమాగా రాబోతోంది. ఇది కూడా బాహుబలి, యన్.టి.ఆర్ల తరహాలోనే మధ్యలో రెండు భాగాలుగా మారిన చిత్రం.
ఇది సరైన ఆలోచనేనా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘పుష్ప-1’ రిలీజైనపుడు డివైడ్ టాక్ రావడంతో రెండు భాగాలుగా సినిమా తీయాలనుకోవడమే తప్పన్నారు. తొలి భాగమే సంతృప్తి పరచని నేపథ్యంలో అసలు సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ డివైడ్ టాక్ను తట్టుకుని ఈ సినిమా విజయవంతం అయింది. సెకండ్ పార్ట్ మీద ఇప్పుడు అంచనాలు, ఆసక్తి పెరిగాయి. మరి అంచనాల ఒత్తిడిని తట్టుకుని సుక్కు ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తాడు.. ‘పుష్ప-2’ సినిమా బాహుబలిని అనుసరిస్తుందా.. విశ్వరూపం, యన్.టి.ఆర్ల కోవలో పయనిస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on January 10, 2022 5:27 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…