ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలయ్యే వాళ్లు. ఆ తర్వాత వాళ్ల మేనల్లుళ్లు.. అన్నదమ్ముల కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి రావడం మొదలైంది. గత కొన్నేళ్లలో హీరోల అల్లుళ్లు కూడా హీరోలైపోతుండటం చూస్తున్నాం. ఈ జాబితాలో కృష్ణ అల్లుడు సుధీర్ బాబు పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. అతను హీరో అయిన మొదట్లో చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కానీ తర్వాత నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని హీరోగా నిలబడ్డాడు.
తాను కూడా అలాగే నిలదొక్కుకుంటానని అనుకుని ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్. శ్రీజను పెళ్లి చేసుకున్న కొంత కాలానికి కళ్యాణ్ తెరంగేట్రం చేశాడు. అతడి తొలి చిత్రానికి ‘విజేత’ అంటూ చిరంజీవి క్లాసిక్ మూవీ టైటిల్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం కళ్యాణ్ను తీవ్ర నిరాశకే గురి చేసింది. తొలి సినిమా ఫ్లాప్ అయినా నిరాశ చెందకుండా ‘సూపర్ మచ్చి’ అని, ‘కిన్నెరసాని’ అని రెండు సినిమాలను లైన్లో పెట్టాడు కళ్యాణ్.
ఈ రెండు చిత్రాలూ దాదాపుగా ఒకే టైంలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఐతే కళ్యాణ్ దృష్టంతా ‘కిన్నెరసాని’ మీదే ఉన్నట్లుంది. ‘అశ్వథ్థామ’ దర్శకుడు రమణ తేజ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రోమోలు కూడా బాగున్నాయి. ఐతే కళ్యాణ్ ఎప్పుడో పూర్తి చేసిన ‘సూపర్ మచ్చి’ చడీచప్పుడు లేకుండా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఆ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు.
కళ్యాణ్ దేవ్ కూడా ఆ చిత్రాన్ని పట్టించుకుంటున్నట్లు లేడు. దాని మీద అతడికి ఏమాత్రం ఆశలు లేనట్లే ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రమోషన్లు లేవు. కనీసం ఒక ట్రైలర్ కూడా లాంచ్ చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం సందడన్నదే లేదు. చూస్తుంటే సినిమాను నామమాత్రంగా రిలీజ్ చేసి వదిలించేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతికి ‘బంగార్రాజు’ సహా మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ప్రేక్షకుల దృష్టంతా వాటి మీదే ఉంది. వీటి మధ్య ‘సూపర్ మచ్చి’ కొట్టుకుపోవడం లాంఛనమే.
This post was last modified on January 10, 2022 7:36 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…