Movie News

‘పుష్ప 2’ ఐటెం సాంగ్.. సుకుమార్ ప్లాన్ ఇదే!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ అనే సినిమా రాబోతుంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సుకుమార్ సెకండ్ పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

‘పుష్ప ది రైజ్’లో సమంత ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిజం చెప్పాలంటే.. ఇందులో అల్లు అర్జున్ డాన్స్ కంటే జనాలంతా సమంత పెర్ఫార్మన్స్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఆమె కాస్ట్యూమ్స్, క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఆమె గ్లామర్ షోకి, మాస్ స్టెప్స్ కి బీ,సీ ఆడియన్స్ లో భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో కూడా అదే రేంజ్ లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. 

దేవిశ్రీప్రసాద్-సుకుమార్ అంటే ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈసారి ‘ఊ అంటావా మావా’కి మించి ఐటెం సాంగ్ ఉండాల్సిందేనని భావిస్తున్నారు. అయితే సమంత ప్లేస్ లో బాలీవుడ్ భామను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే ‘పుష్ప’ సినిమాకి హిందీలో మంచి టాక్ వచ్చింది. అలానే భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపితే నార్త్ లో మరింత బజ్ వస్తుందనేది ఆలోచన. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్లాన్ వర్కవుట్ చేయాలని చూస్తున్నారు. మరి పుష్పరాజ్ తో స్టెప్ వేయడానికి ఏ హీరోయిన్ ముందుకొస్తుందో చూడాలి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. 

This post was last modified on January 10, 2022 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago