మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైతేనే కానీ ‘ఆచార్య’ రాదని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆచార్య’ సినిమా కథ శ్రీకాకుళంలో జిల్లాలో ఎప్పుడో 1970లలో జరిగిన కథ అని అంటున్నారు. ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’ను తెరకెక్కించారట.
ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళంలో బొడ్డపాడు అనే గ్రామంలో శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అతడి జీవితం ఆధారంగానే ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం రాశారు. సుబ్బారావు తరువాత ఆ ఉద్యమాన్ని అతడి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు పేరున్న నక్సలైట్లు సుబ్బారావు చేసే ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచేవారు.
ఈ ఇద్దరు నక్సలైట్లు ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. ఇప్పుడు కొరటాల శివ అదే థీమ్ ను తీసుకొని.. సినిమాకి కూడా ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో సుబ్బారావు జీవితాన్ని ‘ఆచార్య’ సినిమాగా తీసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…