మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైతేనే కానీ ‘ఆచార్య’ రాదని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఆచార్య’ సినిమా కథ శ్రీకాకుళంలో జిల్లాలో ఎప్పుడో 1970లలో జరిగిన కథ అని అంటున్నారు. ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా ‘ఆచార్య’ను తెరకెక్కించారట.
ఒరిస్సాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి శ్రీకాకుళంలో బొడ్డపాడు అనే గ్రామంలో శివుడి గుడిలో పూజారిగా ఉంటూ భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అతడి జీవితం ఆధారంగానే ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం రాశారు. సుబ్బారావు తరువాత ఆ ఉద్యమాన్ని అతడి తమ్ముడు హేమచంద్ర పాణిగ్రాహి చేపట్టాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు పేరున్న నక్సలైట్లు సుబ్బారావు చేసే ఉద్యమానికి సపోర్ట్ గా నిలిచేవారు.
ఈ ఇద్దరు నక్సలైట్లు ఉపాధ్యాయులుగా పని చేసి అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. ఇప్పుడు కొరటాల శివ అదే థీమ్ ను తీసుకొని.. సినిమాకి కూడా ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులతో సుబ్బారావు జీవితాన్ని ‘ఆచార్య’ సినిమాగా తీసినట్లు సమాచారం.
This post was last modified on January 9, 2022 9:11 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…