అప్పటివరకు ప్రభాస్ అంటే కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. టాలీవుడ్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే ‘బాహుబలి’ సినిమా ఎప్పుడైతే విడుదలైందో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్ వైడ్ గా అతడికి ఉన్న పాపులారిటీ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగులో ఆయన నటించిన ‘సాహో’ సినిమా ఏవరేజ్ గా ఆడినా.. ఉత్తరాదిన మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
‘రాధేశ్యామ్’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన రేంజ్ కి తగ్గట్లే ప్రభాస్ కూడా రెమ్యునరేషన్ బాగా పెంచేశారు. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి కమర్షియల్ యాడ్స్ లో నటించే ఆఫర్లు వచ్చాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు వందల కోట్లు ఆఫర్ చేశాయి.
కానీ ప్రభాస్ మాత్రం ఒప్పుకోలేదట. ఈ నెల రోజుల గ్యాప్ లో ఆయన ఏకంగా వంద కోట్ల ఆఫర్ ని కాదన్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సాధారణంగా మన హీరో, హీరోయిన్లు తమ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. వారికొచ్చిన ఏ ఆఫర్ ను మిస్ చేసుకోరు. యాడ్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు కాబట్టి వెంటనే ఒప్పుకుంటారు.
వీలైనన్ని ఎక్కువ బ్రాండ్స్ తన
ఖాతాల్లో వేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. బడా కంపెనీలకు సైతం నో అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. దాదాపు నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on January 9, 2022 2:57 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…