Political News

జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్సే.. ఆఖ‌రి ఛాన్స్‌: CBN

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో మూడోరోజు పర్యటించిన ఆయన.. వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్.. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్‌ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ను రెండేళ్లు వాయిదా వేసేందుకే.. జ‌గ‌న్ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచిందని  చంద్రబాబు అన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్…పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్‌ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మూడోరోజు విస్తృతంగా పర్యటించారు. కుప్పంలో కొత్త‌గా నిర్మిస్తున్న‌ టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన.. పనులు త్వరగా పూర్తిచేయాలని స్థానిక నేతలను ఆదేశించారు. అనంతరం రామకుప్పానికి చెందిన దళితులు కుప్పం ఆర్అడ్‌బీ అతిథిగృహం వద్ద చంద్రబాబును కలిశారు. గ్రామంలో..అంబేడ్కర్‌ విగ్రహ వివాదంపై ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు అండగా ఉండాల్సిన పోలీసులు విఫలమయ్యారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై చర్యల్లేవు అని బాబు నిప్పులు చెరిగారు.

ఆ తర్వాత‌ గుడిపల్లె మండలం శెట్టిపల్లె వెళ్లిన చంద్రబాబు.. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గుడికొత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన..రేషన్‌ బియ్యాన్ని చూపించి నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలెలా తింటారని ప్రశ్నించారు. ఉద్యోగులను జగన్‌ మోసగించారని మండిపడ్డారు. హామీల అమలు గురించి జగన్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

“ఓటీఎస్‌ ఎవరూ కట్టొద్దు… పేదలకు అండగా నేను ఉన్నా. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత తెదేపాది. ఇవ్వడానికి డబ్బుల్లేక 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచారు. జగన్‌ ప్రకటించింది రివర్స్‌ పీఆర్సీ“ అని బాబు వ్యాఖ్యానించారు.

అనంతరం సి.బండపల్లిలో అక్రమ క్వారీ తవ్వకాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతపై పోలీసులు వారించినా పట్టించుకోకుండా.. సుమారు 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడిచి 2 గంటలపాటు అక్రమ మైనింగ్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గంలో.. యథేచ్ఛగా చేస్తున్న మైనింగ్‌ని, వైసీపీ అరాచకాలను ప్రపంచానికి తెలియజేసేందుకే…ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు.

This post was last modified on January 9, 2022 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

3 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

3 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

10 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

11 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

12 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

12 hours ago