ఏపీలో సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఈ వివాదం మొదలైంది గత ఏడాది వేసవిలో ‘వకీల సాబ్’ రిలీజ్ టైంలో. ఏపీ సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో దీన్ని టార్గెట్ చేసే క్రమంలో వివాదం రాజుకుంది. ఆ తర్వాత ఈ వివాదం చినికి చినికి గాలి వానలా మారి ప్రతిష్ఠంభన నెలకొనడం తెలిసిందే. ఈ వివాదం పెద్దది కావడానికి ‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కూడా ఒక కారణమే.
‘వకీల్ సాబ్’ టైంలో పెట్టిన ఆంక్షల్ని ఆ తర్వాత అయినా ఎత్తి వేస్తారేమో అని ఎదురు చూసి.. చివరికి విసిగిపోయిన నేపథ్యంలోనే పవన్ తాడో పేడో తేల్చుకుందామనే రీతిలో ఆ రోజు అలా మాట్లాడారు. ఐతే దీని వల్ల జగన్ సర్కారు మరింత ఇగోకు పోయింది. సమస్యను మరింత జఠిలం చేసింది. ఎవరు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. టికెట్ల రేట్ల విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. ఐతే ఈ విషయంలో పవన్ కళ్యాణ్దే తప్పు అంటున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
ప్రభుత్వాలతో ఘర్షణ వైఖరి ఎప్పుడూ మంచిది కాదని.. తమకు నచ్చని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ల మీద విమర్శలు చేయకూడదని తమ్మారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శల వల్ల ఇండస్ట్రీతో పాటు ‘రిపబ్లిక్’ సినిమాకు కూడా చాలా నష్టం జరిగిందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన అలా ప్రభుత్వాన్ని విమర్శించాలనుకున్నపుడు తన పార్టీ ఆఫీసులో కూర్చుని చేయాల్సిందని, ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్లో అలా మాట్లాడటం తప్పని ఆయనన్నారు.
దీని వల్ల ‘రిపబ్లిక్’ సినిమాకు చాలా నష్టం జరిగిందని, సాయిధరమ్ తేజ్ భవిష్యత్ దెబ్బ తిందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. మామూలుగా తేజు సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, కానీ పవన్ వ్యాఖ్యల వల్లే ‘రిపబ్లిక్’కు కలెక్షన్లు రాలేదని అన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల వైసీపీ మద్దతుదారుల్లో పది శాతం మంది ఈ సినిమా చూడటం మానేసి ఉన్నా పెద్ద నష్టం జరిగినట్లే అన్నారాయన. పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి కూడా నష్టం జరిగిందని, సమస్య ఇంకా పెద్దదైందని.. మరోవైపు వైపీపీ మంత్రులు, నాయకులు అనవసర వ్యాఖ్యలతో వివాదాన్ని పెద్దది చేశారని తమ్మారెడ్డి అన్నారు.
This post was last modified on January 4, 2022 7:29 pm
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…