యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను థియేటర్లో చూసి చాలా కాలమవుతోంది. ‘అరవింద సమేత’ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. 2020లో రిలీజ్ అవుతుందనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. 2022 జనవరి 7న సినిమా పక్కా రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఆ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ భారీ హిట్ తో మొదలుపెడదామనుకున్న ఎన్టీఆర్ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిజల్ట్ ఏంటో తెలియకుండానే కొరటాల శివ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెలలోనే సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ‘ఉప్పెన’ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా చాలా రోజులుగా ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించేశారు. ఆయనకు కూడా కథ నచ్చింది. కానీ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో క్లారిటీ లేక సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు కొరటాల శివ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమా కూడా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.
బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో పక్కా ప్లానింగ్ తో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు.
కొరటాల సినిమా మొదలుపెట్టిన ఒకట్రెండు నెలల్లో బుచ్చిబాబు సినిమా కూడా మొదలవుతుందని సమాచారం. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు ఎన్టీఆర్. ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందని సమాచారం. ఈ రెండేళ్లలో ఎన్టీఆర్ నుంచి మూడు సినిమాలు రావడం పక్కా అని తెలుస్తోంది.
This post was last modified on January 4, 2022 12:12 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…