Movie News

అల్లు అరవింద్‌పై రాజేంద్ర ప్రసాద్ పంచ్‌లు

తెర మీదే కాదు.. బయట ఎక్కడైనా వేదికలెక్కి మాట్లాడేటపుడు కూడా సీనియర్ నటుడు రాజేంద్ర అందరినీ భలేగా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆయన ప్రసంగాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. నాలుగున్నర దశాబ్దాలుగా నటుడిగా అనేక గొప్ప పాత్రలతో అలరిస్తూ వస్తున్న ఆయన.. ఇప్పుడు ‘సేనాపతి’ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అల్లు వారి ఆహా ఓటీటీ కోసం చిరంజీవి తనయురాలు సుస్మిత నిర్మాణంలో యువ దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన చిత్రమిది.

ఆసక్తికర ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ గురువారమే దీనికి ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో పంచులు విసురుతూ మాట్లాడటం.. ఆ పంచ్‌లు ఆహా అధినేత అల్లు అరవింద్‌ను టార్గెట్ చేస్తూ సాగడం విశేషం. అల్లు రామలింగయ్యకు అరవింద్ కంటే కూడా తాను అంటేనే చాలా ఇష్టమని.. పక్కన్న అరవింద్‌ను పెట్టుకుని స్టేట్మెంట్ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్.

అంతే కాక.. నిజమా కాదా అని అరవింద్‌నే అడిగారు. దీనికి అరవింద్ బదులిస్తూ.. ‘‘నిజమే. నన్ను కొడుకు అనేవారు. ఈయన్ని దొంగ నా కొడుకు అనేవారు’’ అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. ఇండస్ట్రీలో తనకు సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా అత్యంత ఆప్త మిత్రుడు చిరంజీవే అన్న విషయం అరవింద్‌కు బాగా తెలుసని.. చిరంజీవి కూతురంటే తనకూ సుస్మిత కూతురు అని.. ఆమె నిర్మాణంలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

అరవింద్‌తో తనకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నా సరే.. ఇప్పటిదాకా తనను లీడ్ రోల్‌లో పెట్టి ఒక్క సినిమా కూడా తీయలేదని.. కానీ ఇప్పుడు తన కూతురు సుస్మిత వచ్చి తనతో ‘సేనాపతి’ తీసిందని అరవింద్‌పై మరో పంచ్ వేశారు రాజేంద్ర ప్రసాద్. సుస్మిత లాంటి యువ నిర్మాతలు తక్కువ డబ్బులు పెట్టి పెద్ద సినిమాలు తీస్తున్నారని.. అరవింద్ లాగా భారీ చిత్రాల జోలికి పోకుండా ఆమె ఇదే ఒరవడిని కొనసాగించాలని కూడా రాజేంద్ర ప్రసాద్ సరదాగా మరో చురక అంటించారు అల్లు వారికి.

This post was last modified on December 30, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago