పోయినేడాది కరోనా టైంలో అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన నాని సినిమా వి మీద ఎన్నెన్ని విమర్శలొచ్చాయో తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు తీర్మానించారు. నాని ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లు.. తర్వాత ఆ నిర్ణయమే సరైందన్నారు. థియేటర్లలో రిలీజైతే కచ్చితంగా ఇది డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు.
ఇక నాని తర్వాతి సినిమా టక్ జగదీష్ సైతం ఊహించని విధంగా ఓటీటీ బాటే పట్టింది. వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయగా.. కరోనా సెకండ్ వేవ్తో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని కూడా అమేజాన్ ప్రైమ్కే ఇచ్చేశారు. దానికి కూడా టాక్ ఏమంత బాగా లేకపోయింది. వి మూవీతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ ఇది కూడా థియేటర్లలోకి వస్తే ఫ్లాపే అయ్యేది.
ఐతే నాని మాత్రం ఈ రెండు చిత్రాలకు ఓటీటీలో వచ్చిన స్పందన, ఆ చిత్రాల వల్ల అమేజాన్ ప్రైమ్కు జరిగిన లాభం ప్రకారం చూస్తే అవి హిట్లే అంటున్నాడు. కొన్నేళ్ల కిందట అమేజాన్ ప్రైమ్లో తన సినిమా ఎంసీఏ రిలీజైనపుడు ఆ ఓటీటీకి కొత్త సబ్స్క్రిప్షన్లు బాగా పెరిగాయని.. ఆ తర్వాత వి, టక్ జగదీష్ చిత్రాలకూ సబ్స్క్రిప్షన్లు పెరిగాయని.. దీని పట్ల ఓటీటీ నిర్వాహకులు చాలా హ్యాపీ అని.. ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు కేక్ కూడా కట్ చేశారని నాని తెలిపాడు.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని.. థియేటర్ల కోసమే సినిమాలను దాయాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో అంతా బాగున్నపుడు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలని.. శ్యామ్ సింగరాయ్ విషయంలో అదే జరుగుతోందని నాని అన్నాడు. జెర్సీ చూసినపుడు ఎలాంటి భావన కలిగిందో.. శ్యామ్ సింగ రాయ్ చూసినపుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని.. ఇదో గొప్ప సినిమా అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on December 22, 2021 8:31 pm
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…