పోయినేడాది కరోనా టైంలో అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన నాని సినిమా వి మీద ఎన్నెన్ని విమర్శలొచ్చాయో తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు తీర్మానించారు. నాని ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లు.. తర్వాత ఆ నిర్ణయమే సరైందన్నారు. థియేటర్లలో రిలీజైతే కచ్చితంగా ఇది డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు.
ఇక నాని తర్వాతి సినిమా టక్ జగదీష్ సైతం ఊహించని విధంగా ఓటీటీ బాటే పట్టింది. వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయగా.. కరోనా సెకండ్ వేవ్తో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని కూడా అమేజాన్ ప్రైమ్కే ఇచ్చేశారు. దానికి కూడా టాక్ ఏమంత బాగా లేకపోయింది. వి మూవీతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ ఇది కూడా థియేటర్లలోకి వస్తే ఫ్లాపే అయ్యేది.
ఐతే నాని మాత్రం ఈ రెండు చిత్రాలకు ఓటీటీలో వచ్చిన స్పందన, ఆ చిత్రాల వల్ల అమేజాన్ ప్రైమ్కు జరిగిన లాభం ప్రకారం చూస్తే అవి హిట్లే అంటున్నాడు. కొన్నేళ్ల కిందట అమేజాన్ ప్రైమ్లో తన సినిమా ఎంసీఏ రిలీజైనపుడు ఆ ఓటీటీకి కొత్త సబ్స్క్రిప్షన్లు బాగా పెరిగాయని.. ఆ తర్వాత వి, టక్ జగదీష్ చిత్రాలకూ సబ్స్క్రిప్షన్లు పెరిగాయని.. దీని పట్ల ఓటీటీ నిర్వాహకులు చాలా హ్యాపీ అని.. ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు కేక్ కూడా కట్ చేశారని నాని తెలిపాడు.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని.. థియేటర్ల కోసమే సినిమాలను దాయాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో అంతా బాగున్నపుడు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలని.. శ్యామ్ సింగరాయ్ విషయంలో అదే జరుగుతోందని నాని అన్నాడు. జెర్సీ చూసినపుడు ఎలాంటి భావన కలిగిందో.. శ్యామ్ సింగ రాయ్ చూసినపుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని.. ఇదో గొప్ప సినిమా అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on December 22, 2021 8:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…