పోయినేడాది కరోనా టైంలో అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన నాని సినిమా వి మీద ఎన్నెన్ని విమర్శలొచ్చాయో తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా దీన్ని విశ్లేషకులు తీర్మానించారు. నాని ఫ్యాన్స్ ఈ సినిమా చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లు.. తర్వాత ఆ నిర్ణయమే సరైందన్నారు. థియేటర్లలో రిలీజైతే కచ్చితంగా ఇది డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు.
ఇక నాని తర్వాతి సినిమా టక్ జగదీష్ సైతం ఊహించని విధంగా ఓటీటీ బాటే పట్టింది. వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయగా.. కరోనా సెకండ్ వేవ్తో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని కూడా అమేజాన్ ప్రైమ్కే ఇచ్చేశారు. దానికి కూడా టాక్ ఏమంత బాగా లేకపోయింది. వి మూవీతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ ఇది కూడా థియేటర్లలోకి వస్తే ఫ్లాపే అయ్యేది.
ఐతే నాని మాత్రం ఈ రెండు చిత్రాలకు ఓటీటీలో వచ్చిన స్పందన, ఆ చిత్రాల వల్ల అమేజాన్ ప్రైమ్కు జరిగిన లాభం ప్రకారం చూస్తే అవి హిట్లే అంటున్నాడు. కొన్నేళ్ల కిందట అమేజాన్ ప్రైమ్లో తన సినిమా ఎంసీఏ రిలీజైనపుడు ఆ ఓటీటీకి కొత్త సబ్స్క్రిప్షన్లు బాగా పెరిగాయని.. ఆ తర్వాత వి, టక్ జగదీష్ చిత్రాలకూ సబ్స్క్రిప్షన్లు పెరిగాయని.. దీని పట్ల ఓటీటీ నిర్వాహకులు చాలా హ్యాపీ అని.. ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు కేక్ కూడా కట్ చేశారని నాని తెలిపాడు.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని.. థియేటర్ల కోసమే సినిమాలను దాయాల్సిన అవసరం లేదని.. అదే సమయంలో అంతా బాగున్నపుడు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలని.. శ్యామ్ సింగరాయ్ విషయంలో అదే జరుగుతోందని నాని అన్నాడు. జెర్సీ చూసినపుడు ఎలాంటి భావన కలిగిందో.. శ్యామ్ సింగ రాయ్ చూసినపుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని.. ఇదో గొప్ప సినిమా అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on December 22, 2021 8:31 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…