క్యాన్సర్.. ఈ మాట వింటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇప్పటికీ మెడికల్ సైన్స్కి అంతు చిక్కని ఈ వ్యాధి నిత్యం ఎందరినో కబళిస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడ్డారు. కొందరు దాన్ని జయించారు. కొందరు పోరాడుతున్నారు. ఇప్పుడు మరో నటి కూడా క్యాన్సర్ బారిన పడింది. తనే హంసానందిని. తనకి బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా కోరుకున్న విజయం దక్కలేదు హంసకి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఐటమ్ సాంగ్స్తో ఎక్కువ పాపులర్ అయ్యింది. అంతా బానేవుంది అనుకుంటున్న సమయంలో ఈ భయంకర వ్యాధి ఆమె శరీరంలోకి ప్రవేశించింది. నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్లో ఒక లంప్ ఉన్నట్టు హంస గుర్తించింది. టెస్టులు చేయిస్తే క్యాన్సర్ అని తేలింది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
‘ఎన్ని సమస్యలైనా రానియ్. జీవితం నా పట్ల ఎంత నిర్దయగా అయినా ఉండనియ్. నేను కుంగిపోను. భయం, బాధ, నెగిటివిటీలను నా దగ్గరకు రానివ్వను. నన్ను జయించే అవకాశం ఈ వ్యాధికి నేను ఇవ్వను. ధైర్యంతో, ప్రేమతో నేను ముందుకే వెళ్తాను’ అంటూ ధైర్యంగా తన పరిస్థితి గురించి పోస్ట్ చేసింది నందిని. ఈ సందర్భంగా జుట్టంతా రాలిపోయి గుండుతో ఉన్న ఫొటోని కూడా షేర్ చేసిందామె.
దురదృష్టంకొద్దీ హంసానందిని తల్లి బ్రెస్ క్యాన్సర్తోనే కొన్నేళ్ల క్రితం చనిపోయారు. హంసకి కూడా అదే సమస్య వచ్చింది. కన్ఫర్మ్ అయిన వెంటనే సర్జరీ చేసి ట్యూమర్ని తీసేశారు. ఇప్పటి వరకు తొమ్మిది కీమోథెరపీలు జరిగాయి. ఇంకో ఏడు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు కానీ మరోసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు డెబ్భై శాతం, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నలభై అయిదు శాతం ఉన్నాయని డాక్టర్స్ చెప్పారట. అంటే జీవితాంతం తను జాగ్రత్తగానే ఉండాలి.
ఇంత జరిగినా తాను ధైర్యంగానే ఉన్నానని హంస చెబుతోంది. దీనివల్ల తాను కుమిలిపోనని, పూర్తిగా కోలుకుని తనలాంటి వారందరికీ ధైర్యాన్నిస్తానని అంటోంది. అంతేకాదు.. వీలైనంత త్వరలో మళ్లీ కెమెరా ముందుకు వస్తానని, ఎప్పటిలానే వెండితెరపై మెరిసి మెప్పిస్తానని చెబుతోంది. అలాగే జరగాలని, హంస వెంటనే కోలుకోవాలని మనమూ ప్రార్థిద్దాం.
This post was last modified on December 20, 2021 1:44 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…