నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అది కూడా శ్రీ రామానుజాచార్యుల కథ అని తెలుస్తోంది.
ఇందులో బాలకృష్ణ.. రామానుజులు పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. రామానుజులు.. వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు.
అటువంటి వ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ప్రముఖ రచయిత జె.కె.భారవి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన ‘శ్రీ మంజునాథ’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ‘రామానుజులు’ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈమేరకు రాఘవేంద్రరావుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన గనుక ఓకే చెబితే.. బాలయ్యతో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. గతంలో బాలయ్య ప్రధాన పాత్రలో ‘పాండురంగడు’ అనే సినిమా తీశారు దర్శకేంద్రుడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on December 14, 2021 10:39 pm
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…