నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అది కూడా శ్రీ రామానుజాచార్యుల కథ అని తెలుస్తోంది.
ఇందులో బాలకృష్ణ.. రామానుజులు పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. రామానుజులు.. వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు.
అటువంటి వ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ప్రముఖ రచయిత జె.కె.భారవి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన ‘శ్రీ మంజునాథ’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ‘రామానుజులు’ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈమేరకు రాఘవేంద్రరావుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన గనుక ఓకే చెబితే.. బాలయ్యతో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. గతంలో బాలయ్య ప్రధాన పాత్రలో ‘పాండురంగడు’ అనే సినిమా తీశారు దర్శకేంద్రుడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on December 14, 2021 10:39 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…