నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆయన మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నారు. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అది కూడా శ్రీ రామానుజాచార్యుల కథ అని తెలుస్తోంది.
ఇందులో బాలకృష్ణ.. రామానుజులు పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. రామానుజులు.. వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు.
అటువంటి వ్యక్తి జీవితచరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నారు. ప్రముఖ రచయిత జె.కె.భారవి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన ‘శ్రీ మంజునాథ’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత ‘రామానుజులు’ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈమేరకు రాఘవేంద్రరావుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన గనుక ఓకే చెబితే.. బాలయ్యతో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. గతంలో బాలయ్య ప్రధాన పాత్రలో ‘పాండురంగడు’ అనే సినిమా తీశారు దర్శకేంద్రుడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on December 14, 2021 10:39 pm
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు.. బుధవారం ఉదయం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా…