బాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటైన ‘ఇక్బాల్’ మూవీతో మంచి పేరు సంపాదించిన నటుడు శ్రేయస్ తల్పాడే. ఆ తర్వాత గోల్ మాల్ సిరీస్తో.. ఇంకా ఓం శాంతి ఓం, హౌస్ ఫుల్ లాంటి చిత్రాలతో శ్రేయస్ బాగానే పాపులర్ అయ్యాడు. ఈ నటుడు ఇప్పుడు మన అల్లు అర్జున్కు డబ్బింగ్ చెబుతుండటం విశేషం. బన్నీ కొత్త చిత్రం ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటే హిందీలో తొలిసారి నేరుగా రిలీజవుతున్న బన్నీ సినిమా ఇదే.
హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రాలను యూట్యూబ్లో రిలీజ్ చేసి బాగా పాపులారిటీ సంపాదించిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్ ‘పుష్ప’ హిందీ హక్కులను సొంతం చేసుకోగా.. నార్త్ మార్కెట్లో పేరుమోసిన సంస్థ అయిన ఏఏ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వీళ్లు ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ విషయంలో బాగానే శ్రద్ధ పెట్టినట్లున్నారు. మామూలుగా హిందీ డబ్బింగ్ చిత్రాల కోసం పని చేసే రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులతో లాగించేయకుండా బన్నీ పాత్రకు శ్రేయస్ లాంటి పేరున్న నటుడితో డబ్బింగ్ చెప్పించడం విశేషం.
‘పుష్ప’ హిందీ ట్రైలర్ను లాంచ్ చేస్తూ ఈ విషయాన్ని శ్రేయసే వెల్లడించాడు. ఇండియాలోనే మోస్ట్ పవర్ ఫుల్, స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్కు వాయిస్ ఇచ్చినందుకు తాను చాలా గర్విస్తున్నానంటూ మన హీరోకు ఎలివేషన్ ఇచ్చాడు శ్రేయస్. అతను డబ్బింగ్ చెప్పిన తొలి తెలుగు చిత్రం ఇదేనట. ఇంతకుముందు ‘లయన్ కింగ్’ కోసం తొలిసారి డబ్బింగ్ చెప్పాడు శ్రేయస్.
‘పుష్ప’ హిందీ ట్రైలర్ ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కాగా.. నార్త్ ఇండియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సెలబ్రెటీలు సైతం దీని గురించి పాజిటివ్గా ట్వీట్ చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించిన బన్నీ.. ‘పుష్ప’తో అక్కడ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…