ఎంత పెద్ద దర్శకుడికైనా ప్రతిసారీ అంచనాలను అందుకోవడం అంటే అంత సులువు కాదు. అందులోనూ ఓ సినిమా మొదలవడంతోనే అంచనాలు నెలకొని.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అవి కొన్ని రెట్లు పెరిగిపోతే అప్పుడు ఆశల్ని నిలబెట్టడం చాలా కష్టమే అవుతుంది. కానీ బోయపాటి శ్రీను మాత్రం అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టాడు. బాలయ్యతో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన బోయపాటి.. అఖండతోనూ హ్యాట్రిక్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు.
కామన్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా సరే.. అభిమానులకు మాత్రం అఖండ ఒక పండుగ లాగే ఉంది. బాలయ్యను ఎలా చూడాలనుకుంటారో అలా.. ఫుల్ ఎనర్జీతో చూపించడం.. బోయపాటితో సినిమా అనేసరికి వేరే లెవెల్లో పెర్ఫామ్ చేసే బాలయ్య కూడా అఖండ పాత్రలో విజృంభించడంతో థియేటర్లలో అభిమానులకు పూనకాలు వచ్చేస్తున్నాయి.
సమీక్షకులు ఏమన్నా.. నాన్ ఫ్యాన్స్ ఎలాంటి కామెంట్లు చేసినా.. అభిమానులు మాత్రం అఖండ విషయంలో మామూలు ఆనందంలో లేరు. మళ్లీ మళ్లీ షోలు రిపీట్ చేస్తున్నారు. థియేటర్లలో వాళ్ల సంబరాలు మామూలుగా లేవు. రూలర్ సినిమా చూసి బాలయ్య పనైపోయిందన్న వాళ్లంతా.. ఇప్పుడు థియేటర్లలో ఆ హంగామా చూసి, సినిమాకు వస్తున్న ఓపెనింగ్స్ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇదంతా కచ్చితంగా బోయపాటి మహిమే అనడంలో సందేహం లేదు.
బోయపాటితో బాలయ్య సినిమా అనగానే ఆటోమేటిగ్గా హైప్ వచ్చేసింది. ప్రోమోలతో ఆ హైప్ను ఇంకా ఇంకా పెంచడంలో బోయపాటి విజయవంతం అయ్యాడు. ఇక సినిమా అంతటా మాస్ మూమెంట్స్, ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ ఉండటంతో అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెడుతూ.. మళ్లీ బాలయ్య కెరీర్కు మంచి ఊపు ఇచ్చిన బోయపాటిపై బాలయ్య అభిమానుల అభిమానం అంతా ఇంతా కాదు. వాళ్లు ఆయనకు తమ గుండెల్లో ఎప్పుడో గుడి కట్టేశారు. బయట కూడా అదే పని చేస్తారేమో అన్నట్లుంది పరిస్థితి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…