‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ పాత్ర విషయంలో మెగా అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకులందరూ అమితాసక్తితో ఉన్నారు. చిరు-చరణ్లను స్క్రీన్ మీద చూడటం ఎవరికైనా ఆనందాన్నిచ్చే విషయమే. ఇంతకుముందు ‘మగధీర’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఈ తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ‘ఆచార్య’ సంగతి అలా కాదు. ఇందులో చరణ్ ఓ కీలక పాత్రనే పోషిస్తున్నాడు. దాని నిడివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండబోతోందని అర్థమవుతోంది.
ఇటీవలే రిలీజ్ చేసిన సిద్ధ పాత్ర తాలూకు టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూల ో చరణ్ ఈ పాత్ర గురించి మరిన్ని విశేషాలు వెల్లడించాడు. ఆ కబుర్లు తన పాత్రపై, సినిమాపై మరింత అంచనాలు పెంచేలాగే ఉన్నాయి.
సిద్ధ పాత్రను ముందు క్యామియో రోల్ అనే అనుకున్నామని.. తర్వాత దాని నిడివి పెరిగి మొత్తంగా 40 నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో కనిపిస్తుందని చరణ్ వెల్లడించాడు. ఈ పాత్ర ప్రథమార్ధంలో ఉండదని.. ద్వితీయార్ధంలో ప్రవేశిస్తుందని చరణ్ చెప్పాడు. ద్వితీయార్ధం మొత్తం ఈ పాత్ర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని.. కథలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చరణ్ తెలిపాడు. ఆచార్య పాత్ర మొదలుపెట్టే ఒక పెద్ద మూమెంట్ను సిద్ధ క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్తుందని చరణ్ వెల్లడించాడు.
తనది ఇందులో చిరు వారసత్వాన్ని కొనసాగించే కామ్రేడ్ పాత్ర అని కూడా చరణ్ తెలిపాడు. ఈ మాటలు మెగా అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేవే. ఇటీవల రిలీజ్ చేసిన సిద్ధ టీజర్లో పులి-పులి పిల్లల్ని చూపించి ఆ వెంటనే చిరు-చరణ్లను చూపించిన షాట్ వారికి మామూలు హైని ఇవ్వలేదు. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిందా టీజర్. సినిమాలో వీళ్లిద్దరి మీదా ఒక పాట కూడా ఉంటుందని కొరటాల చెబుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 1, 2021 10:35 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…