Movie News

ట్విట్ట‌ర్ సీఈఓ రాజీనామా.. ప‌గ్గాలు మ‌నోడికే

సోష‌ల్ మీడియా జెయింట్ ట్విట్ట‌ర్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు.. 16 ఏళ్లుగా ఆ సంస్థ‌తో కొన‌సాగుతూ వ‌చ్చిన జాక్.. సోమ‌వారం రాజీనామా ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. చాలా ఏళ్ల నుంచి ట్విట్ట‌ర్‌కు సీఈవోగా ఉన్న జాక్.. తాను ట్విట్ట‌ర్‌ను వ‌దిలి వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఎప్పుడూ ట్విట్ట‌ర్లో ఇత‌ర అంశాలు ట్రెండ్ అవుతుంటాయి కానీ.. ఇప్పుడు జాక్ రాజీనామాతో ట్విట్ట‌రే ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవ‌డం మొద‌లైంది. ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌డైన జాక్.. సంస్థ‌ ఛైర్మ‌న్‌గా, వైస్ ఛైర్మ‌న్‌గా వివిధ ప‌ద‌వుల్లో ఉన్నాడు. ఇప్పుడు సీఈవోగా దిగిపోతున్నాడు. జాక్ స్థానంలోకి వ‌స్తున్న‌ది ఒక భార‌త సంత‌తి వ్య‌క్తి కావ‌డం విశేషం. అత‌డి పేరు.. పరాగ్ అగ‌ర్వాల్. ఈ పేరు చూస్తేనే త‌ను భార‌తీయుడ‌ని అర్థ‌మైపోతుంది.

ప‌రాగ్ ట్విట్ట‌ర్ సీఈవోగా నియ‌మితుడైన విష‌యాన్ని స్వ‌యంగా జాక్‌యే వెల్ల‌డించాడు. వెంట‌నే ప‌రాగ్ ట్విట్ట‌ర్ బ‌యోలో సీఈవో ఆఫ్ ట్విట్ట‌ర్ అని వ‌చ్చేసింది కూడా. అత‌ను కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. జాక్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్ర‌పంచంలో అతి పెద్ద మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు చాలా వాటికి భార‌తీయులు, భార‌త సంత‌తికి చెందిన వాళ్లే సీఈవోలు, ఛైర్మ‌న్లుగా ఉన్నారు.

గూగుల్ సంస్థ‌కు చెన్నైకి చెందిన సుంద‌ర్ పిచ్చాయ్ చాలా ఏళ్లుగా సీఈవోగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే తెలుగువాడైన స‌త్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను న‌డిపిస్తున్నాడు. ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ‌.. అడోబ్ సీఈవో శాంత‌ను నారాయ‌ణ్‌.. పాలో ఆల్టో నెట్ వ‌ర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. ఇలా మ‌రెన్నో ప్ర‌ఖ్యాత మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌ను న‌డిపిస్తున్న‌ది భార‌తీయులు, భార‌త సంతతికి చెందిన వాళ్లే కావ‌డం మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణం.

This post was last modified on November 29, 2021 11:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: paragTwitter

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

7 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

8 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

8 hours ago