Political News

చూసిందే న‌మ్మండి: భువ‌నేశ్వ‌రి వీడియో ఎందుకంటే!

“చూసిందే న‌మ్మండి”- అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి గ‌త రాత్రి సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. దీనిలో ఆమె.. తాను.. వైస్ చైర్స‌న్‌, ఎండీగా ఉన్న ‘హెరిటేజ్‌’ సంస్థ‌కు సంబంధించిన అంశాల‌ను ప్ర‌స్తావించారు. “చూసిందే నమ్మండి. గ‌త 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.” అని భువ‌నేశ్వ‌రి వివ‌రించారు.

అంతేకాదు.. హెరిటేజ్ సంస్థ నుంచి ఉత్ప‌త్తి అయ్యే ప్ర‌తి దానినీ 25 నాణ్యతా పరీక్షలు చేస్తామ‌ని, ఆ తర్వాతే వినియోగదారుల ఇంటికి చేరుతుందని భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 9 రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పాడి రైతులతో పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామ‌న్నారు. ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించి అర్థం చేసుకోవాల‌ని కూడా భువ‌నేశ్వ‌రి సూచించారు.

ఎందుకు?

అయితే… నారా భువ‌నేశ్వ‌రి మూడు ద‌శాబ్దాలుగా హెరిటేజ్‌ను ముందుకు న‌డిపిస్తూ.. స‌క్సెస్‌ఫుట్ వ్యాపార వేత్త‌గా ఉన్నా.. ఎప్పుడూ.. ఇలా సెల్ఫీ వీడియోల‌తో ప్ర‌జ‌ల ముందుకు రాలేదు. ఇదే తొలిసారి. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది ప్ర‌శ్న‌. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియాలో గ‌త వారం ప‌ది రోజులుగా.. హెరిటేజ్ సంస్థ‌పై ప‌లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగం జ‌రిగింద‌న్న రిపోర్టు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది పెద్ద రాజకీయ దుమారానికి దారి తీసింది.

ఈ క్ర‌మంలోనే ఇందాపూర్ పూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ పాలు సేక‌రిస్తోంద‌ని.. దీనిలోనూ కెరోటిన్ అనే ర‌సాయనం ఉంద‌ని జ‌గ‌న్ మీడియా స‌హా .. వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. అటు శాస‌న మండ‌లిలోనూ దీనిపైనే చ‌ర్చ సాగుతోంది. ఇది కూడా వివాదాల మ‌ధ్య సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మ సంస్థ ఉత్ప‌త్తుల‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకునేందుకు నారా భువ‌నేశ్వ‌రి.. ఇలా సెల్పీ వీడియోను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 20, 2026 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago