“చూసిందే నమ్మండి”- అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గత రాత్రి సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. దీనిలో ఆమె.. తాను.. వైస్ చైర్సన్, ఎండీగా ఉన్న ‘హెరిటేజ్’ సంస్థకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. “చూసిందే నమ్మండి. గత 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.” అని భువనేశ్వరి వివరించారు.
అంతేకాదు.. హెరిటేజ్ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి దానినీ 25 నాణ్యతా పరీక్షలు చేస్తామని, ఆ తర్వాతే వినియోగదారుల ఇంటికి చేరుతుందని భువనేశ్వరి పేర్కొన్నారు. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 9 రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పాడి రైతులతో పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనించి అర్థం చేసుకోవాలని కూడా భువనేశ్వరి సూచించారు.
ఎందుకు?
అయితే… నారా భువనేశ్వరి మూడు దశాబ్దాలుగా హెరిటేజ్ను ముందుకు నడిపిస్తూ.. సక్సెస్ఫుట్ వ్యాపార వేత్తగా ఉన్నా.. ఎప్పుడూ.. ఇలా సెల్ఫీ వీడియోలతో ప్రజల ముందుకు రాలేదు. ఇదే తొలిసారి. మరి ఇలా ఎందుకు జరిగింది? అనేది ప్రశ్న. వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో గత వారం పది రోజులుగా.. హెరిటేజ్ సంస్థపై పలు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న రిపోర్టు వచ్చిన తర్వాత.. ఇది పెద్ద రాజకీయ దుమారానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే ఇందాపూర్ పూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ పాలు సేకరిస్తోందని.. దీనిలోనూ కెరోటిన్ అనే రసాయనం ఉందని జగన్ మీడియా సహా .. వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అటు శాసన మండలిలోనూ దీనిపైనే చర్చ సాగుతోంది. ఇది కూడా వివాదాల మధ్య సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ సంస్థ ఉత్పత్తులపై వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు నారా భువనేశ్వరి.. ఇలా సెల్పీ వీడియోను విడుదల చేయడం గమనార్హం.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…