ప్రతి దర్శకుడికీ తాను తీసే సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది. స్క్రిప్టు దగ్గరే ఎంతో నమ్ముతాడు కాబట్టే సినిమా తీస్తాడు. తాను గొప్పగా సినిమా తీస్తున్నాననే నమ్మకమే ఆ దర్శకుడిని ముందుకు నడిపిస్తుంది. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక కూడా చాలామందికి తాము తీసిన సినిమాల్లో లోపాలు కనిపించవు. అలాగే వచ్చి ప్రి రిలీజ్ ఈవెంట్లలో తమ సినిమాల గురించి గొప్పలు పోతుంటారు.
కొన్నిసార్లు వాళ్ల మాటలకు తగ్గట్లే సినిమాలుంటాయి. కానీ కొన్నిసార్లు అంచనాలు తలకిందులవుతుంటాయి. మరీ ఎక్కువ గొప్పలు చెప్పుకున్న సినిమాలు తుస్సుమనిపిస్తే ఆ మాటలు కాస్తా ట్రోల్ మెటీరియల్స్గా మారిపోతుంటాయి. బోయపాటి శ్రీను తీసిన ఓ సినిమా విషయంలో అదే జరిగింది. ఆ చిత్రమే.. వినయ విధేయ రామ. ఈ సినిమాపై అప్పట్లో ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే.
ఈ అంచనాలను మరింత పెంచేసే స్పీచ్ ఇచ్చాడు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను. అభిమానులు తనను నమ్మాలని.. గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడొచ్చని బోయపాటి స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా చూస్తే సినిమా ఎంత డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇక అప్పట్నుంచి బోయపాటి అన్న గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడండి.. నన్ను నమ్మండి అనే డైలాగ్స్ మీమ్ పేజీల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఐతే ఈ సంగతి తెలుసో లేదో కానీ.. బోయపాటి మళ్లీ అవే పద ప్రయోగాలు చేశాడు అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్లో. బిలీవ్ మి.. గుండెల మీద చెయ్యేసుకుని చూడండి.. రేప్పొద్దున మీరు చూస్తారు.. మామూలుగా ఉండదు.. ఇలాంటి కామెంట్లతో వినయ విధేయ రామ స్పీచ్ను గుర్తుకు తెచ్చాడు బోయపాటి. కాకపోతే బాలయ్యతో బోయపాటి సినిమా అంటే గురి తప్పదన్న నమ్మకం అందరిలో ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసినా సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అంచనాలే కలుగుతున్నాయి.
This post was last modified on November 28, 2021 11:14 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…