ప్రతి దర్శకుడికీ తాను తీసే సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉంటుంది. స్క్రిప్టు దగ్గరే ఎంతో నమ్ముతాడు కాబట్టే సినిమా తీస్తాడు. తాను గొప్పగా సినిమా తీస్తున్నాననే నమ్మకమే ఆ దర్శకుడిని ముందుకు నడిపిస్తుంది. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక కూడా చాలామందికి తాము తీసిన సినిమాల్లో లోపాలు కనిపించవు. అలాగే వచ్చి ప్రి రిలీజ్ ఈవెంట్లలో తమ సినిమాల గురించి గొప్పలు పోతుంటారు.
కొన్నిసార్లు వాళ్ల మాటలకు తగ్గట్లే సినిమాలుంటాయి. కానీ కొన్నిసార్లు అంచనాలు తలకిందులవుతుంటాయి. మరీ ఎక్కువ గొప్పలు చెప్పుకున్న సినిమాలు తుస్సుమనిపిస్తే ఆ మాటలు కాస్తా ట్రోల్ మెటీరియల్స్గా మారిపోతుంటాయి. బోయపాటి శ్రీను తీసిన ఓ సినిమా విషయంలో అదే జరిగింది. ఆ చిత్రమే.. వినయ విధేయ రామ. ఈ సినిమాపై అప్పట్లో ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే.
ఈ అంచనాలను మరింత పెంచేసే స్పీచ్ ఇచ్చాడు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను. అభిమానులు తనను నమ్మాలని.. గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడొచ్చని బోయపాటి స్టేట్మెంట్ ఇచ్చాడు. తీరా చూస్తే సినిమా ఎంత డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇక అప్పట్నుంచి బోయపాటి అన్న గుండెల మీద చెయ్యేసుకుని సినిమా చూడండి.. నన్ను నమ్మండి అనే డైలాగ్స్ మీమ్ పేజీల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఐతే ఈ సంగతి తెలుసో లేదో కానీ.. బోయపాటి మళ్లీ అవే పద ప్రయోగాలు చేశాడు అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్లో. బిలీవ్ మి.. గుండెల మీద చెయ్యేసుకుని చూడండి.. రేప్పొద్దున మీరు చూస్తారు.. మామూలుగా ఉండదు.. ఇలాంటి కామెంట్లతో వినయ విధేయ రామ స్పీచ్ను గుర్తుకు తెచ్చాడు బోయపాటి. కాకపోతే బాలయ్యతో బోయపాటి సినిమా అంటే గురి తప్పదన్న నమ్మకం అందరిలో ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసినా సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అంచనాలే కలుగుతున్నాయి.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…