ఇండియన్ సినిమాలో పాటల కోసం భారీగా ఖర్చు చేసే ట్రెండ్ మొదలుపెట్టిందే శంకర్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కో పాట మీద కోటి రూపాయల ఖర్చు పెట్టడం మామూలు విషయం అయిపోయింది కానీ.. శంకర్ పది పదిహేనేళ్ల కిందటే పాటల కోసం కోట్లు పెట్టించేసేవాడు. శివాజీ సినిమాలో ఒక్కో పాటకు అయిన ఖర్చు, ఆ సెట్టింగ్స్, ఆ విజువల్స్ చూసి అప్పట్లో అందరికీ కళ్లు చెదిరిపోయాయి.
శంకర్ మిగతా సినిమాల్లో పాటు ఎంత రిచ్గా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాల్లో ఒక్కో పాటకు పెట్టే ఖర్చుతో చిన్న స్థాయిలో ఒక సినిమా తీసేయొచ్చంటే అతిశయోక్తి కాదు. ఏ స్థితిలోనూ ఆయన ఈ విషయంలో రాజీ పడరు. రామ్ చరణ్ హీరోగా తీస్తున్న కొత్త సినిమా విషయంలోనూ ఆయన ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఒక అదిరిపోయే డ్యాన్స్ నంబర్ కోసం శంకర్ కోట్లు ఖర్చు చేయిస్తున్నాడట.
రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట కోసం జరుగుతున్న సన్నాహాలు చర్చనీయాంశంగా మారాయి. కళ్లు చెదిరే సెట్టింగ్స్ వేసి రెండు మూడు వారాల పాట ఈ పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఈ పాటలో ఏకంగా 80 మంది ఫారిన్ డ్యాన్సర్లు కనిపిస్తారట. విదేశాలకు వెళ్లినపుడు అక్కడి లోకల్ డ్యాన్సర్లను బ్యాగ్రౌండ్లో ఉపయోగించుకోవడం మామూలే. కానీ విదేశాల నుంచి 80 మంది డ్యాన్సర్లను రప్పించి ఇక్కడ భారీ స్థాయిలో పాట చిత్రీకరించడం మాత్రం నభూతో అని చెప్పొచ్చు.
ఈ పాట సినిమాకు హైలైట్ అయ్యేలా భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారని.. చరణ్ దీని కోసం చాలా రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ను జీ స్టూడియోస్ వాళ్లకు రూ.350 కోట్లకు అమ్మినట్లుగా ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2021 8:32 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…