ప్రతి సినిమాకీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఒక సినిమాలో ప్రతి విషయాన్నీ ప్రత్యేకంగా ప్లాన్ చేయడం కొన్నిసార్లే సాధ్యపడుతుంది. కొందరు దర్శకులకే చేతనవుతుంది. ప్రశాంత్ నీల్ అలాంటి దర్శకుడేనని ‘కేజీఎఫ్’ చూస్తే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపించే స్క్రీన్ ప్లే.. మాటిమాటికీ వచ్చి మెస్మరైజ్ చేసే హీరో ఎలివేషన్ సీన్స్.. కదిలించే డైలాగ్స్.. కట్టిపడేసే యాక్షన్ సీక్వెన్సెస్.. ఒకటా రెండా, అన్నీ స్పెషల్గానే ఉంటాయి ఆ సినిమాలో. ‘సాలార్’ విషయంలోనూ ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడట ప్రశాంత్.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ ఆద్యంతం చాలా ఎమోషనల్గా ఉండబోతోందని టాక్. ఇందులో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నాడట. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్లో వస్తుందట. సైనికుడిగా పవర్ఫుల్గా కనిపిస్తాడట. ఇక హీరోయిన్ శ్రుతీ హాసన్ క్యారెక్టర్ అయితే కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు. ప్రభాస్కి, శ్రుతికి మధ్య నడిచే ట్రాక్ మనసుల్ని తాకేలా ఉంటుందట. ప్రీ క్లైమాక్స్లో ఆమె చనిపోతుందట కూడా.
ఇక యాక్షన్ సీన్స్ అయితే ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల్లో కనిపించినదానికి మించి ఉంటాయట. కొన్ని సీన్స్లో ప్రభాస్ అగ్రెషన్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తుందని చెబుతున్నారు. అలాగే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంది. అది కూడా ఏదో గ్లామర్ కోసం పెట్టింది కాదట. సినిమాలోని ఓ స్పెషల్ సిచ్యుయేషన్లో వస్తుందట. దాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టితో చేయిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తన స్థానంలో శ్రద్ధా కపూర్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవన్నీ వింటుంటే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ చాలా స్పెసల్ ఎఫర్ట్ పెడుతున్నాడని అర్థమవుతోంది. ‘కేజీఎఫ్’ ఎఫెక్ట్ వల్ల ప్రేక్షకుల అంచనాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. యశ్ లాంటి యంగ్ హీరోనే ఆ రేంజ్లో ఎలివేట్ చేశాడంటే.. ప్రభాస్ లాంటి ప్యాన్ వరల్డ్ స్టార్ని ఇక ఏ స్థాయిలో చూపిస్తాడో అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతున్నారు ఫ్యాన్స్. వాటిని అందుకోవాలంటే ఆమాత్రం స్కెచ్చులు వేయక తప్పదు మరి.
This post was last modified on November 22, 2021 8:41 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…