Movie News

సాయిపల్లవి చెల్లెలు వస్తోంది

అక్కలు హీరోయిన్లు అవ్వడం, ఆ వెనకే చెల్లెళ్లు ఇండస్ట్రీకి రావడం ఎప్పటి నుంచో ఉన్నదే. రాధిక చెల్లెలు నిరోషా, నగ్మా చెల్లి జ్యోతిక, కాజల్ సిస్టర్ నిషా.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కాస్త పెద్దదే. ఇప్పుడు మరో చెల్లెలు అక్క బాటలో పయనిస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. తనెవరో కాదు.. సాయిపల్లవి చెల్లెలు పూజ.

కోలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టిన సాయిపల్లవి ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. కొన్ని ఈవెంట్స్‌లో తనతో పాటు ఆమె చెల్లెలు పూజ కూడా కనిపించింది. తనని చూసి అందరూ అచ్చం సాయిపల్లవిలానే ఉందే అంటూ ఆశ్చర్యపోయారు. పూజ కూడా సినిమాల్లోకి వస్తోందంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అవి ఇప్పటికి నిజమయ్యాయి. పూజ హీరోయిన్‌గా మొదటి సినిమా రెడీ అయ్యింది.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌‌ సిల్వా మెగాఫోన్ పట్టి ‘చితిరై సెవ్వానం’ అనే చిత్రాన్ని తీశాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథలో తండ్రిగా సముద్రఖని నటించారు. కూతురిగా పూజ కనిపించబోతోంది. అమృత స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్‌‌ 3 నుంచి జీ5లో స్ట్రీమ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌ను కనుక సడెన్‌గా చూస్తే అందులో ఉన్నది సాయిపల్లవేనేమో అనిపించడం ఖాయం.

సాయిపల్లవి హీరోయిన్‌ అయినప్పుడు ఆమె అసలు హీరోయిన్ మెటీరియలే కాదన్నారు కొందరు. మరీ సింపుల్‌గా ఉంటుంది. మేకప్ వేసుకోదు. కొత్త కొత్త స్టైల్స్ ట్రై చేయదు. గ్లామర్‌‌కీ దూరం. ఇలా అయితే ఎలా అన్నారు. కానీ ఆమె నటనకు ఫిదా అయిపోయి ఇప్పుడు హారతి పడుతున్నారు. ఆమెని దృష్టిలో పెట్టుకుని పాత్రలు డిజైన్ చేస్తున్న దర్శకులూ ఉన్నారు. పూజ చూడటానికైతే అక్కలానే ఉంటుంది. మరి ఆమెలానే బెస్ట్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Satya

Recent Posts

మసూద దర్శకుడు… ఎట్టకేలకు

తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…

46 seconds ago

బేబీ డబ్బులు ఇంకా రాలేదా?

తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…

19 minutes ago

బాబు ప్రభుత్వాన్ని దున్నపోతు తో పోల్చిన జగన్

సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…

27 minutes ago

ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

1 hour ago

చాలా రోజుల తర్వాత జగన్‌ ను అలా చూసి…

రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి…

1 hour ago

కోల్కతా సెంటిమెంట్ పాజిటివ్ కావాలి

మాములుగా మన తెలుగు తమిళ సినిమాల్లో మాఫియా అంటే ముంబైనే చూపిస్తారు. రజనీకాంత్ బాషా నుంచి పవన్ కళ్యాణ్ ఓజి…

1 hour ago