Movie News

గ్రాండ్ మాస్టర్‌‌గా మిస్టర్‌‌ పర్‌‌ఫెక్ట్?

ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరి దృష్టీ బయోపిక్స్‌పై ఉంటోంది. హీరోలూ వాటికి రెడీ అంటున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌లో పర్‌‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కువ. ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేసేందుకు కూడా చాన్స్ ఎక్కువ. అందుకే వాటికి అంత డిమాండ్. ముఖ్యంగా బాలీవుడ్ వారు బయోపిక్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో అక్కడ మరో గ్రేట్ పర్సన్ లైఫ్‌ స్టోరీ తెరకెక్కబోతోంది. ఆయనెవరో కాదు.. ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.

ఈ విషయాన్ని స్వయంగా ఆనందే కన్‌ఫర్మ్ చేయడం విశేషం. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన రావడంతో వివరాలు రివీల్ చేశారు ఆనంద్. ‘నా బయోపిక్‌ తీయడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా వల్ల లేటయ్యింది’ అని చెప్పారాయన. మీ పాత్రలో ఎవరు నటిస్తారని అడిగితే ఆమిర్‌‌ ఖాన్ అయితే బాగుంటుందని చెప్పారు. ‘నా పాత్ర ఎవరు చేస్తారో నాకైతే ఇంకా తెలీదు. కానీ ఆమిర్ చేస్తేనే బాగుంటుంది. ఆయనకీ నాకూ వ్యక్తిత్వపరంగా చాలా దగ్గర పోలికలు ఉంటాయి’ అని చెప్పారు.

అయితే ఆమిర్ ఒప్పుకుంటాడా అనేదే ఇప్పుడున్న డౌట్. ఆల్రెడీ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్‌’లో రియల్‌ లైఫ్‌ రోల్‌లో అదరగొట్టాడు ఆమిర్. తను నటిస్తే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్‌ కూడా వేరే లెవెల్‌కి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ‘లాల్‌ సింగ్ ఛద్దా’తో బిజీగా ఉన్నాడు.

ఆమిర్ కనుక ఈ బయోపిక్‌కి ఒప్పుకుంటే ఆ సినిమా రిలీజయ్యాక ఇది సెట్స్‌కి వెళ్తుంది. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమాకి ఒప్పుకోవడం కాదు కదా, అసలు ఆలోచించడానికి కూడా ఇష్టపడడు మిస్టర్ పర్‌‌ఫెక్ట్. కాబట్టి ఆయన అభిప్రాయం కోసం వెయిట్ చేయాల్సిందే. ఒప్పుకుంటే ఓకే. లేదంటే టీమ్ మరో యాక్టర్‌‌ని వెతుక్కోవాల్సి వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో!

This post was last modified on November 20, 2021 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago