ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరి దృష్టీ బయోపిక్స్పై ఉంటోంది. హీరోలూ వాటికి రెడీ అంటున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ. ఎమోషనల్గా ఆడియెన్స్ని కనెక్ట్ చేసేందుకు కూడా చాన్స్ ఎక్కువ. అందుకే వాటికి అంత డిమాండ్. ముఖ్యంగా బాలీవుడ్ వారు బయోపిక్స్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో అక్కడ మరో గ్రేట్ పర్సన్ లైఫ్ స్టోరీ తెరకెక్కబోతోంది. ఆయనెవరో కాదు.. ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.
ఈ విషయాన్ని స్వయంగా ఆనందే కన్ఫర్మ్ చేయడం విశేషం. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన రావడంతో వివరాలు రివీల్ చేశారు ఆనంద్. ‘నా బయోపిక్ తీయడానికి నేను పర్మిషన్ ఇచ్చాను. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది. కరోనా వల్ల లేటయ్యింది’ అని చెప్పారాయన. మీ పాత్రలో ఎవరు నటిస్తారని అడిగితే ఆమిర్ ఖాన్ అయితే బాగుంటుందని చెప్పారు. ‘నా పాత్ర ఎవరు చేస్తారో నాకైతే ఇంకా తెలీదు. కానీ ఆమిర్ చేస్తేనే బాగుంటుంది. ఆయనకీ నాకూ వ్యక్తిత్వపరంగా చాలా దగ్గర పోలికలు ఉంటాయి’ అని చెప్పారు.
అయితే ఆమిర్ ఒప్పుకుంటాడా అనేదే ఇప్పుడున్న డౌట్. ఆల్రెడీ సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’లో రియల్ లైఫ్ రోల్లో అదరగొట్టాడు ఆమిర్. తను నటిస్తే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కూడా వేరే లెవెల్కి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్దా’తో బిజీగా ఉన్నాడు.
ఆమిర్ కనుక ఈ బయోపిక్కి ఒప్పుకుంటే ఆ సినిమా రిలీజయ్యాక ఇది సెట్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమాకి ఒప్పుకోవడం కాదు కదా, అసలు ఆలోచించడానికి కూడా ఇష్టపడడు మిస్టర్ పర్ఫెక్ట్. కాబట్టి ఆయన అభిప్రాయం కోసం వెయిట్ చేయాల్సిందే. ఒప్పుకుంటే ఓకే. లేదంటే టీమ్ మరో యాక్టర్ని వెతుక్కోవాల్సి వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో!
This post was last modified on November 20, 2021 2:00 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…