బాహుబలి రానంత వరకు ఇండియన్ సినిమాలో బాలీవుడ్ వాళ్లదే ఆధిపత్యం. ఓవరాల్ కలెక్షన్ల విషయంలో హిందీ సినిమాలకు.. మిగతా భాషా చిత్రాలకు చాలా అంతరం ఉండేది. బడ్జెట్లు, పారితోషకాలు, బిజినెస్, వసూళ్లు.. ఇలా ఏ రకంగా చూసినా బాలీవుడ్ వాళ్లే పైచేయి సాధించేవాళ్లు. కానీ ‘బాహుబలి’తో అన్ని లెక్కలూ మారిపోయాయి. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ హిందీ సినిమాలకు గట్టి సవాలు విసిరింది.
ఈ కన్నడ సినిమా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. నార్త్ మార్కెట్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. దీంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులూ ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ ఆలస్యమవుతున్నా సరే రోజు రోజుకూ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.
‘కేజీఎఫ్-2’ను 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా ఏ భాషలోనూ పేరున్న సినిమాలను రిలీజ్ చేయరనే అనుకున్నారు. కానీ హిందీలో ఓ భారీ చిత్రాన్ని ‘కేజీఎఫ్-2’కు పోటీగా నిలిపారు. ఆ చిత్రమే.. లాల్ సింగ్ చద్దా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారం.
ఆమిర్ మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ రూపొందించిన ఈ చిత్రం కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ముందు గత ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనున్నారు. కానీ కరోనా ఫస్ట్ వేవ్ వల్ల వాయిదా తప్పలేదు. తర్వాత ఈ ఏడాది క్రిస్మస్కు డేట్ మార్చగా.. కరోనా సెకండ్ వేవ్తో మళ్లీ తేదీ మార్చక తప్పలేదు. ‘కేజీఎఫ్-2’ రిలీజ్ డేట్ ప్రకటించి చాలా రోజులైంది. ఈ సంగతి తెలిసి కూడా ఆమిర్ ఖాన్ దాంతో పోటీకి సై అంటున్నాడు. ‘కేజీఎఫ్-2’ను తక్కువ అంచనా వేస్తే ఆమిర్ సినిమాకు డ్యామేజ్ తప్పకపోవచ్చు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి డేట్ మార్చుకుంటుందేమో చూడాలి.
This post was last modified on November 20, 2021 1:55 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…