ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి చిత్రాలతో ఒక టైంలో మాంచి ఊపుమీద కనిపించాడు యువ కథానాయకుడు శర్వానంద్. కానీ ఆ తర్వాత అతడి కెరీర్ గాడి తప్పింది. గత ఐదేళ్లలో ఒక్క ‘మహానుభావుడు’ మినహా శర్వాకు ఒక్క సక్సెస్ కూడా లేదు. ‘శ్రీకారం’ లాంటి మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం అతడికి నిరాశనే మిగిల్చాయి. ఇటీవలే ‘మహాసముద్రం’తో మరో చేదు ఫలితాన్ని అందుకున్నాడు శర్వా.
ఇప్పుడిక తన చేతిలో ఉన్న రెండు క్లాస్ చిత్రాల మీదే అతడి ఆశలన్నీ నిలిచి ఉన్నాయి. అందులో ఒకటి ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ కాగా.. ఇంకోటి ‘ఒకే ఒక జీవితం’. వీటిలో మొదటి చిత్రాన్ని ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్నాడు. షూటింగ్ మధ్య దశలో ఉంది. ‘ఒకే ఒక జీవితం’ విషయానికి వస్తే ఇది తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం.
కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్తో అందరినీ ఆకట్టుకున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఐతే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోదన్నది కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. వరుస ఫ్లాపుల కారణంగా శర్వా మార్కెట్ బాగా దెబ్బ తినేయడంతో థియేట్రికల్ రిలీజ్ మీద నిర్మాత ఎస్.ఆర్.ప్రభు అంతగా ఆసక్తి చూపించట్లేదట.
‘జర్నీ’ మూవీతో ఒకప్పుడు తమిళంలో శర్వాకు మంచి గుర్తింపే లభించింది. తర్వాత తమిళంలో మరో చిత్రం చేసిన శర్వా.. ఆపై చాలా ఏళ్లు కోలీవుడ్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి తమిళంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసినా అంత మంచి ఫలితం వచ్చే అవకాశం లేదు. తెలుగులోనూ శర్వా పరిస్థితి ఆశాజనకంగా లేదు. అమేజాన్ ప్రైమ్ వాళ్లు మంచి లాభానికి సినిమాను కొంటుండటంతో నిర్మాత ప్రభు ఆ డీల్ను పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నాడట. త్వరలోనే ‘ఒకే ఒక జీవితం’ డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 20, 2021 12:11 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…