త్రివిక్రమ్ శ్రీనివాస్ బేసిగ్గా రచయిత. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు రచయితగానే ఉన్నాడు. ‘స్వయంవరం’ మొదలుకుని.. ‘జై చిరంజీవ’ వరకు రచయితగా కొనసాగాడు. రైటర్గా ఉన్న టైంలోనే దర్శకుడిగా మారాడు. ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకోవడం.. రెండో సినిమా ‘అతడు’తో మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందిస్తూనే తన శైలిలో సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు.
ఐతే త్రివిక్రమ్లో మంచి గేయ రచయిత కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో రవితేజ హీరోగా తన మిత్రుడైన యోగి రూపొందించిన ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రానికి సింగిల్ కార్డ్తో పాటు రాశాడు త్రివిక్రమ్. సినిమాలో ఉన్న ఆరు పాటలూ ఆయన రాసినవే. సినిమా ఆడలేదు కానీ.. అందులోని స్వరాల వీణ.. వెన్నెలే నీవని లాంటి పాటలు అప్పట్లో మార్మోగాయి. ఐతే త్రివిక్రమ్తో తర్వాత ఇంకెవ్వరూ పాటలు రాయించుకోలేదు. తన సినిమాలకు కూడా ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.
ఐతే ఇప్పుడు తాను స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం త్రివిక్రమ్ మళ్లీ లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. పవన్ అడిగాడో.. తనే రాయాలనుకున్నాడో కానీ.. ఇందులో ‘లాలా భీమ్లా’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన పాటకు త్రివిక్రమే సాహిత్యం అందించాడు. 18 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ఇలా లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషమే. ఇందులో పది పడగల పాము పైన పాదమెట్టిన సామి చూడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు.. అంటూ తనదైన శైలిలో త్రివిక్రమ్ అందించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా అప్పుడప్పుడు పాటల్లో త్రివిక్రమ్ తన కలం పదును చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…