త్రివిక్రమ్ శ్రీనివాస్ బేసిగ్గా రచయిత. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు రచయితగానే ఉన్నాడు. ‘స్వయంవరం’ మొదలుకుని.. ‘జై చిరంజీవ’ వరకు రచయితగా కొనసాగాడు. రైటర్గా ఉన్న టైంలోనే దర్శకుడిగా మారాడు. ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకోవడం.. రెండో సినిమా ‘అతడు’తో మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందిస్తూనే తన శైలిలో సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు.
ఐతే త్రివిక్రమ్లో మంచి గేయ రచయిత కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో రవితేజ హీరోగా తన మిత్రుడైన యోగి రూపొందించిన ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రానికి సింగిల్ కార్డ్తో పాటు రాశాడు త్రివిక్రమ్. సినిమాలో ఉన్న ఆరు పాటలూ ఆయన రాసినవే. సినిమా ఆడలేదు కానీ.. అందులోని స్వరాల వీణ.. వెన్నెలే నీవని లాంటి పాటలు అప్పట్లో మార్మోగాయి. ఐతే త్రివిక్రమ్తో తర్వాత ఇంకెవ్వరూ పాటలు రాయించుకోలేదు. తన సినిమాలకు కూడా ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.
ఐతే ఇప్పుడు తాను స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం త్రివిక్రమ్ మళ్లీ లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. పవన్ అడిగాడో.. తనే రాయాలనుకున్నాడో కానీ.. ఇందులో ‘లాలా భీమ్లా’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన పాటకు త్రివిక్రమే సాహిత్యం అందించాడు. 18 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ఇలా లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషమే. ఇందులో పది పడగల పాము పైన పాదమెట్టిన సామి చూడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు.. అంటూ తనదైన శైలిలో త్రివిక్రమ్ అందించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా అప్పుడప్పుడు పాటల్లో త్రివిక్రమ్ తన కలం పదును చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
This post was last modified on November 8, 2021 7:10 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…