Movie News

త్రివిక్రమ్ 18 ఏళ్ల తర్వాత ఇలా..


త్రివిక్రమ్ శ్రీనివాస్ బేసిగ్గా రచయిత. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు రచయితగానే ఉన్నాడు. ‘స్వయంవరం’ మొదలుకుని.. ‘జై చిరంజీవ’ వరకు రచయితగా కొనసాగాడు. రైటర్‌గా ఉన్న టైంలోనే దర్శకుడిగా మారాడు. ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకోవడం.. రెండో సినిమా ‘అతడు’తో మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందిస్తూనే తన శైలిలో సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు.

ఐతే త్రివిక్రమ్‌లో మంచి గేయ రచయిత కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో రవితేజ హీరోగా తన మిత్రుడైన యోగి రూపొందించిన ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రానికి సింగిల్ కార్డ్‌తో పాటు రాశాడు త్రివిక్రమ్. సినిమాలో ఉన్న ఆరు పాటలూ ఆయన రాసినవే. సినిమా ఆడలేదు కానీ.. అందులోని స్వరాల వీణ.. వెన్నెలే నీవని లాంటి పాటలు అప్పట్లో మార్మోగాయి. ఐతే త్రివిక్రమ్‌తో తర్వాత ఇంకెవ్వరూ పాటలు రాయించుకోలేదు. తన సినిమాలకు కూడా ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.

ఐతే ఇప్పుడు తాను స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం త్రివిక్రమ్ మళ్లీ లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. పవన్ అడిగాడో.. తనే రాయాలనుకున్నాడో కానీ.. ఇందులో ‘లాలా భీమ్లా’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన పాటకు త్రివిక్రమే సాహిత్యం అందించాడు. 18 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ఇలా లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషమే. ఇందులో పది పడగల పాము పైన పాదమెట్టిన సామి చూడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు.. అంటూ తనదైన శైలిలో త్రివిక్రమ్ అందించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా అప్పుడప్పుడు పాటల్లో త్రివిక్రమ్ తన కలం పదును చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.

This post was last modified on November 8, 2021 7:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

3 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

4 hours ago