అల్లు అర్జున్ మూణ్నాలుగేళ్ల ముందే చేయాల్సిన సినిమా ‘ఐకాన్’. అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కాల్సింది. దీని గురించి అప్పట్లో ఘనంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. బన్నీ ఐకాన్ అని రాసి ఉన్న క్యాప్ పెట్టుకుని కొంత హడావుడి కూడా చేశాడు కొన్ని రోజులు. తీరా చూస్తే ఈ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. మధ్యలో వేణు ‘వకీల్ సాబ్’ సినిమా తీశాడు. ఆ సినిమా మంచి ఫలితాన్నందుకోవడంతో వేణు మీద బన్నీకి గురి కుదిరిందన్నారు. అతి త్వరలో ‘ఐకాన్’ మొదలవుతుందంటూ ప్రకటనలు కూడా వచ్చాయి. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ అయ్యాక బన్నీ చేసే సినిమా ఇదే అన్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడేమో ఈ సినిమాకు మళ్లీ బ్రేక్ పడ్డట్లు చెబుతున్నారు. బ్రేక్ అంటే తాత్కాలికం కూడా కాదట. పూర్తిగా ఈ సినిమాను ఆపేస్తున్నారట.
తన 21వ సినిమాకు అల్లు అర్జున్.. బోయపాటి శ్రీనుతో జత కట్టబోతున్నట్లు సమాచారం. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘సరైనోడు’ బ్లాక్బస్టర్ కావడం తెలిసిందే. ఐతే ఆ తర్వాత శ్రీను ‘జయ జానకి నాయక’ లాంటి ఫ్లాప్, ‘వినయ విధేయ రామ’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి శ్రీనుతో బన్నీ కథా చర్చలు జరుపుతున్న విషయాన్ని బన్నీ వాసు ఇంతకుముందే వెల్లడించాడు. బన్నీ లైనప్ ఏదనే విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నట్లు కూడా చెప్పాడు. ఐతే తన తదుపరి సినిమాను బోయపాటికే చేయడానికి బన్నీ ఫిక్సయ్యాడని.. ‘ఐకాన్’పై ఊగిసలాట లేకుండా ఆ కథను చేయాలనుకోవట్లేదని వేణుకు స్పష్టం చేశాడని అంటున్నారు. ‘సరైనోడు’ను నిర్మించిన గీతా ఆర్ట్స్ బేనర్లోనే కొత్త సినిమా కూడా తెరకెక్కనుందట. అభిమానుల్లోనూ గందరగోళానికి తావు లేకుండా తాను ‘ఐకాన్’ సినిమా చేయట్లేదని బన్నీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
This post was last modified on November 7, 2021 3:45 am
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…