Movie News

అదే కథతో మాస్ రాజా.. బెల్లంకొండకు బ్యాండేనా?

మాస్ రాజా మాంచి స్పీడు మీదున్నాడు కొంత కాలంగా. వరుసబెట్టి అతను సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ 71వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇది హీరోగా మాస్ రాజాకు 50వ చిత్రం కావడం విశేషం. ముందు అన్నట్లే ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఉన్న సినిమానే రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ కానుంది. ఇంతకుముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి క్రైమ్ కామెడీ చిత్రాలను రూపొందించిన వంశీ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తోనే తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నిర్మించనుంది. 70, 80 దశకాల్లో ఆంధ్రా ప్రాంతంలో భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ జనాలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అనేసరికి అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఐతే ఈ కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రాబోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి ‘స్టూవర్టుపురం దొంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కేఎస్ అనే దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నాడు. చాలా ఏళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న బెల్లంకొండ సురేష్ ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొడుకు హీరోగా పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమాను ఆయన నిర్మించనున్నాడు.

ఐతే ప్రస్తుతం శ్రీనివాస్ ‘చత్రపతి’ హిందీ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. రవితేజ కూడా ఆ టైంలోనే టైగర్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. ఐతే మాస్ రాజా క్రేజ్ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నిలవడం కష్టమే. రవితేజ చేస్తున్న సినిమాకు మాంచి టీం కూడా కూదిరింది. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్రైమ్ మూవీస్ తీయడంలో వంశీకి మంచి పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే కథతో సినిమా చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

This post was last modified on November 3, 2021 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

11 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

49 minutes ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

2 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

2 hours ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

4 hours ago