Movie News

అదే కథతో మాస్ రాజా.. బెల్లంకొండకు బ్యాండేనా?

మాస్ రాజా మాంచి స్పీడు మీదున్నాడు కొంత కాలంగా. వరుసబెట్టి అతను సినిమాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ 71వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇది హీరోగా మాస్ రాజాకు 50వ చిత్రం కావడం విశేషం. ముందు అన్నట్లే ఇది పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఉన్న సినిమానే రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ కానుంది. ఇంతకుముందు దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి క్రైమ్ కామెడీ చిత్రాలను రూపొందించిన వంశీ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తోనే తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నిర్మించనుంది. 70, 80 దశకాల్లో ఆంధ్రా ప్రాంతంలో భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ జనాలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అనేసరికి అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఐతే ఈ కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రాబోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి ‘స్టూవర్టుపురం దొంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కేఎస్ అనే దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నాడు. చాలా ఏళ్లు నిర్మాణానికి దూరంగా ఉన్న బెల్లంకొండ సురేష్ ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొడుకు హీరోగా పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమాను ఆయన నిర్మించనున్నాడు.

ఐతే ప్రస్తుతం శ్రీనివాస్ ‘చత్రపతి’ హిందీ రీమేక్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. రవితేజ కూడా ఆ టైంలోనే టైగర్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. ఐతే మాస్ రాజా క్రేజ్ ముందు బెల్లంకొండ శ్రీనివాస్ నిలవడం కష్టమే. రవితేజ చేస్తున్న సినిమాకు మాంచి టీం కూడా కూదిరింది. జీవీ ప్రకాష్ కుమార్, మధి లాంటి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్రైమ్ మూవీస్ తీయడంలో వంశీకి మంచి పట్టు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే కథతో సినిమా చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

This post was last modified on November 3, 2021 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

30 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago