కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పాలై ఆరు రోజులు గడిచిపోయాయి. కన్నడ నాట అభిమానులు ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు. దీపావళి పండుగ సంబరాలు కూడా అక్కడ ఎప్పట్లా చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. రాజ్ కుమార్ కుటుంబంలో ఎవరికేం జరిగినా తమ కుటుంబంలో జరిగినట్లే ఫీలవుతారు అక్కడి కోట్లాదిమంది.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించిన పునీత్.. ఇలా హఠాత్తుగా మరణించడంతో ఆ బాధను తట్టుకోవడం కన్నడిగులకు సాధ్యం కావడం లేదు. రాజ్ కుమార్ 78 ఏళ్ల వయసులో చనిపోతేనే అభిమానులు తల్లడిల్లిపోయారు.
కొన్ని గుండెలు ఆగిపోయాయి. అలాంటిది పునీత్ 46 ఏళ్లకే మరణిస్తే వారి బాధ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పునీత్ మరణానంతరమే.. అతను ఎంత గొప్పగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడో వెల్లడి కావడంతో కన్నడిగులే కాక వేరే భాషల వాళ్లు కూడా అతడి గురించి ఎంతగానో బాధ పడుతున్నారు.
పునీత్ మరణించిన సమయంలో తెలుగు సినీ తారలే కాక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాన్య ప్రజలు కూడా చూపించిన ప్రేమాభిమానాలకు పునీత్ అభిమానులు కదిలిపోయారు. తెలుగు సినీ ప్రముఖులతో పునీత్కు ఇంత అనుబంధం ఉందా అన్న చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తెలుగువాళ్లంతా కూడా గొప్పగా స్పందించారు.
ఈ నేపథ్యంలోనే పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ను తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ‘జేమ్స్’ సినిమాకు సంబంధించి పునీత్ టాకీ పార్ట్ అంతా పూర్తి చేశాడు. ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్లు చేయాల్సి ఉంది కానీ.. వాటిని పక్కన పెట్టేయనున్నారు.
సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మార్చి 17న పునీత్ పుట్టిన రోజు కానుకగా సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దీన్ని బహు భాషల్లో విడుదల చేసేందుకు అవకాశాలున్నాయి కానీ.. తెలుగులో మాత్రం పెద్ద ఎత్తునే సినిమా విడుదల కానుంది. పునీత్ చనిపోయినపుడు తెలుగు వాళ్లు చూపించిన ప్రేమ ప్రకారం చూస్తే అతడి చివరి సినిమాకు కూడా ఇక్కడ మంచి స్పందన వచ్చే అవకాశముంది.
This post was last modified on November 3, 2021 4:08 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…