2022 సంక్రాంతి పందెం కోళ్లపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. నెల ముందు వరకు అయితే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పండుగ బరిలో ఉంటాయని అనుకున్నారంతా. మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాలతో సందడే సందడిగా ఉంటుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది.
ఆ చిత్రాన్ని సరిగ్గా పండక్కి కాకుండా కొంచెం ముందుగా జనవరి 7న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఇక అప్పట్నుంచి మొదలైంది గందరగోళం. మిగతా మూడు చిత్రాల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఐతే ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో దాన్ని అనుకున్న ప్రకారమే జనవరి 14న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల సంగతే తేలాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ధాటికి మిగతా మూడు భారీ చిత్రాలే భయపడుతుంటే.. నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి రేసులోకి రాబోతోందని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ముందు ఇది విన్న వారికి తమాషాగా అనిపించింది. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో సీరియస్గా ఉన్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు సంక్రాంతికి మించిన సీజన్ లేదన్నది నాగ్ అభిప్రాయం.
అందులోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి రిలీజై ఇరగాడేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన నేపథ్యంలో దాని ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే తేవాలని ఫిక్సయ్యాడు. ఈ సీజన్ మిస్సయితే.. మంచి టైమింగ్ మిస్సయిపోతుంది.
ఐతే సంక్రాంతి సినిమాల గురించి నాగ్ భయపడాల్సిన పని లేదని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వాయిదా పడటం పక్కా అని.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన తమ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఉంటుందని.. పైగా పండుగ టైంలో ఆ భారీ చిత్రాల ఓవర్ ఫ్లోస్ కూడా కలిసొస్తాయన్నది నాగ్ ఆలోచన. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట యధావిధిగా వస్తే తప్ప ‘బంగార్రాజు’ సంక్రాంతి ఆగమనం గ్యారెంటీ అన్నమాటే.
This post was last modified on November 1, 2021 3:16 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…