2022 సంక్రాంతి పందెం కోళ్లపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. నెల ముందు వరకు అయితే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పండుగ బరిలో ఉంటాయని అనుకున్నారంతా. మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాలతో సందడే సందడిగా ఉంటుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది.
ఆ చిత్రాన్ని సరిగ్గా పండక్కి కాకుండా కొంచెం ముందుగా జనవరి 7న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఇక అప్పట్నుంచి మొదలైంది గందరగోళం. మిగతా మూడు చిత్రాల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఐతే ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో దాన్ని అనుకున్న ప్రకారమే జనవరి 14న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల సంగతే తేలాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ధాటికి మిగతా మూడు భారీ చిత్రాలే భయపడుతుంటే.. నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి రేసులోకి రాబోతోందని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ముందు ఇది విన్న వారికి తమాషాగా అనిపించింది. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో సీరియస్గా ఉన్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు సంక్రాంతికి మించిన సీజన్ లేదన్నది నాగ్ అభిప్రాయం.
అందులోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి రిలీజై ఇరగాడేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన నేపథ్యంలో దాని ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే తేవాలని ఫిక్సయ్యాడు. ఈ సీజన్ మిస్సయితే.. మంచి టైమింగ్ మిస్సయిపోతుంది.
ఐతే సంక్రాంతి సినిమాల గురించి నాగ్ భయపడాల్సిన పని లేదని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వాయిదా పడటం పక్కా అని.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన తమ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఉంటుందని.. పైగా పండుగ టైంలో ఆ భారీ చిత్రాల ఓవర్ ఫ్లోస్ కూడా కలిసొస్తాయన్నది నాగ్ ఆలోచన. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట యధావిధిగా వస్తే తప్ప ‘బంగార్రాజు’ సంక్రాంతి ఆగమనం గ్యారెంటీ అన్నమాటే.
This post was last modified on November 1, 2021 3:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…