2022 సంక్రాంతి పందెం కోళ్లపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. నెల ముందు వరకు అయితే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ పండుగ బరిలో ఉంటాయని అనుకున్నారంతా. మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాలతో సందడే సందడిగా ఉంటుందనుకున్నారు. కానీ ఊహించని విధంగా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది.
ఆ చిత్రాన్ని సరిగ్గా పండక్కి కాకుండా కొంచెం ముందుగా జనవరి 7న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం నిర్ణయించింది. ఇక అప్పట్నుంచి మొదలైంది గందరగోళం. మిగతా మూడు చిత్రాల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఐతే ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కావడంతో ఇప్పటికే రెండుమూడుసార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో దాన్ని అనుకున్న ప్రకారమే జనవరి 14న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాల సంగతే తేలాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ ధాటికి మిగతా మూడు భారీ చిత్రాలే భయపడుతుంటే.. నాగార్జున సినిమా ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి రేసులోకి రాబోతోందని కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ముందు ఇది విన్న వారికి తమాషాగా అనిపించింది. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో సీరియస్గా ఉన్నాడు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు సంక్రాంతికి మించిన సీజన్ లేదన్నది నాగ్ అభిప్రాయం.
అందులోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి రిలీజై ఇరగాడేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన నేపథ్యంలో దాని ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే తేవాలని ఫిక్సయ్యాడు. ఈ సీజన్ మిస్సయితే.. మంచి టైమింగ్ మిస్సయిపోతుంది.
ఐతే సంక్రాంతి సినిమాల గురించి నాగ్ భయపడాల్సిన పని లేదని.. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వాయిదా పడటం పక్కా అని.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన తమ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ అండ ఉంటుందని.. పైగా పండుగ టైంలో ఆ భారీ చిత్రాల ఓవర్ ఫ్లోస్ కూడా కలిసొస్తాయన్నది నాగ్ ఆలోచన. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట యధావిధిగా వస్తే తప్ప ‘బంగార్రాజు’ సంక్రాంతి ఆగమనం గ్యారెంటీ అన్నమాటే.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…