కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తి రెండు రోజుల కిందట హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. శాండిల్వుడ్లో నంబర్ వన్ హీరో స్థాయిలో ఉండి, వివాద రహితుడిగా.. గొప్ప సేవాభావం ఉన్నవాడిగా గొప్ప పేరున్న పునీత్.. ఇలా ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచిపోవడం ఇంకా ఎవరికీ జీర్ణం కావడం లేదు.
పునీత్ తెలుగు వాడు కాకపోయినా.. తెలుగులో నటించకపోయినా అతణ్ని మనవాడిలా భావించి తెలుగు వాళ్లందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మన ఇండస్ట్రీ జనాలు కూడా పునీత్ మరణం నేపథ్యంలో స్పందించిన తీరు కన్నడిగులను కదిలించింది. ఇండస్ట్రీలో ప్రముఖులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పునీత్ మృతి పట్ల తమ బాధను, అలాగే సంతాపాన్ని ప్రకటించారు.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. పునీత్ను టాలీవుడ్ ఇలా ఓన్ చేసుకుని అతడి మరణం పట్ల గొప్పగా స్పందించిన తీరును కన్నడిగులు కొనియాడుతున్నారు. ఐతే అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇలాంటి స్పందన లేకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
తెలుగుతో సమానంగా తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడులవుతుంటాయి. భారీగా వసూళ్లు రాబడుతుంటాయి. పునీత్.. తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం ఉంది. కానీ వాళ్లెవ్వరూ కూడా పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరుకు రాలేదు.
దీంతో తెలుగు స్టార్లు ఇక్కడికి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ.. తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తుండటం గమనార్హం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…