టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు.
రెండు రోజుల క్రితమే శంకర్ సినిమా షూటింగ్ మొదలైంది. పూణేలో ప్లాన్ చేసిన ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్ట్లీ సాంగ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా అతడి సినిమాల్లో పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తుంటారు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తుంటారు ఈ డైరెక్టర్.
ఇప్పుడు రామ్ చరణ్-కియారా అద్వానీ మీద యూనిక్ కాన్సెప్ట్ తో డ్యూయెట్ ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క పాటను 12 రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు నిర్మాత దిల్ రాజు. అందుకే దర్శకుడు శంకర్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on October 25, 2021 1:44 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…