టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు.
రెండు రోజుల క్రితమే శంకర్ సినిమా షూటింగ్ మొదలైంది. పూణేలో ప్లాన్ చేసిన ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్ట్లీ సాంగ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా అతడి సినిమాల్లో పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తుంటారు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తుంటారు ఈ డైరెక్టర్.
ఇప్పుడు రామ్ చరణ్-కియారా అద్వానీ మీద యూనిక్ కాన్సెప్ట్ తో డ్యూయెట్ ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క పాటను 12 రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు నిర్మాత దిల్ రాజు. అందుకే దర్శకుడు శంకర్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
This post was last modified on October 25, 2021 1:44 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…