Movie News

ఒక్క పాట కోసం 12 రోజుల పాటు షూటింగ్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు.

రెండు రోజుల క్రితమే శంకర్ సినిమా షూటింగ్ మొదలైంది. పూణేలో ప్లాన్ చేసిన ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్ట్లీ సాంగ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా అతడి సినిమాల్లో పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తుంటారు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తుంటారు ఈ డైరెక్టర్.

ఇప్పుడు రామ్ చరణ్-కియారా అద్వానీ మీద యూనిక్ కాన్సెప్ట్ తో డ్యూయెట్ ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క పాటను 12 రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు నిర్మాత దిల్ రాజు. అందుకే దర్శకుడు శంకర్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

This post was last modified on October 25, 2021 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

20 minutes ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

1 hour ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

2 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

3 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

5 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

7 hours ago