టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు.
రెండు రోజుల క్రితమే శంకర్ సినిమా షూటింగ్ మొదలైంది. పూణేలో ప్లాన్ చేసిన ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారట.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాస్ట్లీ సాంగ్ గా దీన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా అతడి సినిమాల్లో పాటలను చాలా లావిష్ గా చిత్రీకరిస్తుంటారు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తుంటారు ఈ డైరెక్టర్.
ఇప్పుడు రామ్ చరణ్-కియారా అద్వానీ మీద యూనిక్ కాన్సెప్ట్ తో డ్యూయెట్ ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క పాటను 12 రోజులకు పైగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని విధంగా ఈ పాటను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు నిర్మాత దిల్ రాజు. అందుకే దర్శకుడు శంకర్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టడం లేదట. ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెబుతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…
వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…
పెళ్లయిన తర్వాత.. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్. ఈ క్రమంలో ఒకప్పుడు భార్యలను చంపే భర్తల వ్యవహారాలు పెద్ద…