కరోనా కారణంగా థియేటర్లు మూతబడ్డాక చాలా సినిమాల్ని ఓటీటీలు ఆదుకున్నాయి. తెలుగు స్టార్ హీరోలు ఓటీటీకి వెళ్లడానికి అంత ఇష్టపడకపోయినా.. సూర్య, ధనుష్ లాంటి కోలీవుడ్ స్టార్స్ మాత్రం తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంలో సూర్య సక్సెస్ అయినట్టుగా ధనుష్ కాలేదు. అయినా కూడా ధనుష్ సినిమా మరోసారి ఓటీటీ బాట పట్టడం అతని ఫ్యాన్స్ని కంగారు పెడుతోంది.
ధనుష్ నటిస్తున్న ‘మారన్’ మూవీ డిజిటల్ రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ మూవీని మంచి ధర చెల్లించి డిస్నీ హాట్స్టార్ కొనుక్కుంది. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. హింసను ఇష్టపడని హీరోకి ఓ పెద్ద అన్యాయం జరుగుతుంది. అప్పుడతను ఎలా రియాక్టయ్యాడు, హింసే తగిన మార్గమని ఎలా డిసైడయ్యాడు అనేది ఈ సినిమా కథ. ఆల్రెడీ పోస్టర్లతో అంచనాలను పెంచారు. మరి ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియక ధనుష్ అభిమానులు కంగారు పడుతున్నారు.
తను నటించిన ‘జగమే తంత్రం’ కూడా ఓటీటీలోనే రిలీజయ్యింది. ఆ సినిమా థియేటర్స్లో వర్కవుటవదని అనలిస్టులు చెప్పడం వల్లే నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే పెద్ద హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని ఎగ్జిబిటర్లు గొడవ చేశారు. కానీ మూవీ డిజాస్టర్ కావడంతో థియేటర్స్లో విడుదల చేయకపోవడమే మంచిదయ్యింది అనుకున్నారంతా.
ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీకే తీసుకెళ్లడం చూస్తుంటే లేనిసోని అనుమానాలు వస్తున్నాయి. ఇది కూడా హిట్ అయ్యే చాన్స్ లేని సినిమాయేనా, అందుకే థియేటర్లు తెరుచుకున్నాక కూడా ధైర్యం చేయలేకపోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఫ్యాన్స్కి మాత్రం తమ ఫేవరేట్ హీరో సినిమాలు ఇలా ఓటీటీ దగ్గర క్యూ కట్టడం నచ్చడం లేదు. థియేటర్స్లోనే రిలీజ్ చేయాలంటూ ఆల్రెడీ సోషల్ మీడియాలో హడావుడి మొదలెట్టారు. నిర్మాతలు ఏమంటారో చూడాలి మరి.
This post was last modified on October 25, 2021 10:34 am
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…