బాల నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి.. తర్వాత బ్రేక్ తీసుకుని ఓ బేబీ మూవీలో క్యారెక్టర్ రోల్తో రీఎంట్రీ ఇచ్చాడు యువ నటుడు తేజ సజ్జా. ఈ సినిమాతో అతడికి మంచి పేరే వచ్చింది. తర్వాత అతణ్ని హీరోగా పెట్టి తన మిత్రుడు ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి మూవీ తీశాడు. అది డివైడ్ టాక్ను తట్టుకుని ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.
ఐతే ఆ సినిమా వల్ల తేజ ఇమేజ్ అయితే పెద్దగా మారలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ లాంటివేమీ ఏర్పడలేదు. అయినా సరే.. అతడికి ఆఫర్లయితే వస్తున్నాయి. ఇష్క్, అద్భుతం, హనుమాన్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇందులో ఇష్క్ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజై అడ్రస్ లేకుండా పోయింది. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసినప్పటికీ.. అది కూడా రికవర్ కాలేదు. థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాలేదు ఈ సినిమా వల్ల. ఓటీటీ రిలీజ్ ద్వారా కొంత ఆదాయం వెనక్కి వచ్చినట్లుంది.
ఈ సినిమా అనుభవంతో తేజ తర్వాతి చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డట్లున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు థియేటర్లలో బాగా ఆడి డబ్బులు రాబట్టడం అంత తేలిక కాదని అర్థం చేసుకుని.. తేజ కొత్త సినిమా అద్భుతంను ఓటీటీ రిలీజ్కు సిద్ధం చేసేశారు. బాబు బాగా బిజీ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రాన్ని చంద్రశేఖర్ మొగుల్ల నిర్మించాడు. రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని రాజశేఖర్.. తేజకు జోడీగా నటించింది. ఆమెకు కథానాయికగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
This post was last modified on October 18, 2021 9:03 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…