బాల నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి.. తర్వాత బ్రేక్ తీసుకుని ఓ బేబీ మూవీలో క్యారెక్టర్ రోల్తో రీఎంట్రీ ఇచ్చాడు యువ నటుడు తేజ సజ్జా. ఈ సినిమాతో అతడికి మంచి పేరే వచ్చింది. తర్వాత అతణ్ని హీరోగా పెట్టి తన మిత్రుడు ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి మూవీ తీశాడు. అది డివైడ్ టాక్ను తట్టుకుని ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.
ఐతే ఆ సినిమా వల్ల తేజ ఇమేజ్ అయితే పెద్దగా మారలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ లాంటివేమీ ఏర్పడలేదు. అయినా సరే.. అతడికి ఆఫర్లయితే వస్తున్నాయి. ఇష్క్, అద్భుతం, హనుమాన్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇందులో ఇష్క్ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజై అడ్రస్ లేకుండా పోయింది. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసినప్పటికీ.. అది కూడా రికవర్ కాలేదు. థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాలేదు ఈ సినిమా వల్ల. ఓటీటీ రిలీజ్ ద్వారా కొంత ఆదాయం వెనక్కి వచ్చినట్లుంది.
ఈ సినిమా అనుభవంతో తేజ తర్వాతి చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డట్లున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు థియేటర్లలో బాగా ఆడి డబ్బులు రాబట్టడం అంత తేలిక కాదని అర్థం చేసుకుని.. తేజ కొత్త సినిమా అద్భుతంను ఓటీటీ రిలీజ్కు సిద్ధం చేసేశారు. బాబు బాగా బిజీ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రాన్ని చంద్రశేఖర్ మొగుల్ల నిర్మించాడు. రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని రాజశేఖర్.. తేజకు జోడీగా నటించింది. ఆమెకు కథానాయికగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…