బాల నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసి.. తర్వాత బ్రేక్ తీసుకుని ఓ బేబీ మూవీలో క్యారెక్టర్ రోల్తో రీఎంట్రీ ఇచ్చాడు యువ నటుడు తేజ సజ్జా. ఈ సినిమాతో అతడికి మంచి పేరే వచ్చింది. తర్వాత అతణ్ని హీరోగా పెట్టి తన మిత్రుడు ప్రశాంత్ వర్మ జాంబి రెడ్డి మూవీ తీశాడు. అది డివైడ్ టాక్ను తట్టుకుని ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.
ఐతే ఆ సినిమా వల్ల తేజ ఇమేజ్ అయితే పెద్దగా మారలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ లాంటివేమీ ఏర్పడలేదు. అయినా సరే.. అతడికి ఆఫర్లయితే వస్తున్నాయి. ఇష్క్, అద్భుతం, హనుమాన్.. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఇందులో ఇష్క్ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజై అడ్రస్ లేకుండా పోయింది. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసినప్పటికీ.. అది కూడా రికవర్ కాలేదు. థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాలేదు ఈ సినిమా వల్ల. ఓటీటీ రిలీజ్ ద్వారా కొంత ఆదాయం వెనక్కి వచ్చినట్లుంది.
ఈ సినిమా అనుభవంతో తేజ తర్వాతి చిత్రం విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడ్డట్లున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు థియేటర్లలో బాగా ఆడి డబ్బులు రాబట్టడం అంత తేలిక కాదని అర్థం చేసుకుని.. తేజ కొత్త సినిమా అద్భుతంను ఓటీటీ రిలీజ్కు సిద్ధం చేసేశారు. బాబు బాగా బిజీ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రాన్ని చంద్రశేఖర్ మొగుల్ల నిర్మించాడు. రాజశేఖర్ పెద్దమ్మాయి శివాని రాజశేఖర్.. తేజకు జోడీగా నటించింది. ఆమెకు కథానాయికగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
This post was last modified on October 18, 2021 9:03 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…