ఒక స్టార్ హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర షోల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా రిలీజ్ కాలేదంటే వాళ్ల ఆగ్రహం మామూలుగా ఉండదు. దీనికి ఎవరు బాధ్యులు అని చూడకుండా.. థియేటర్ల మీద పడిపోతారు. ఇలా పలు సందర్భాల్లో థియేటర్లు ధ్వంసమైన అనుభవాలున్నాయి. అందులోనూ మాస్లో మంచి ఫాలోయింగ్ హీరోల సినిమాల విషయంలో ఇలా జరక్కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన సుదీప్.. తన కొత్త చిత్రం కోటిగొబ్బ-3 విషయంలో అలా జాగ్రత్త వహించలేకపోయాడు. ఈ సినిమాకు ఫైనాన్స్, ఇతర సమస్యల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ దాటి గురువారం విడుదలకు సిద్ధం చేశారు. తెల్లవారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా పడలేదు. మధ్యాహ్నానికి కూడా థియేటర్లు తెరుచుకోలేదు.
దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల దగ్గర సుదీప్ అభిమానులు గందరగోళం సృష్టించారు. చాలా చోట్ల థియేటర్ల మీద రాళ్లేశారు. స్టాఫ్ మీద దాడులకు దిగారు. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు. అభిమానులకు క్షమాపణ చెబుతూ.. కోటిగొబ్బ-3 గురువారం రిలీజ్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని.. శుక్రవారం కచ్చితంగా సినిమా రిలీజవుతుందని అతను క్లారిటీ ఇచ్చాడు.
అభిమానుల బాధను అర్థం చేసుకోగలనని.. ఐతే థియేటర్ల యాజమాన్యాలకు దీంతో ఏమాత్రం సంబంధం లేదని.. థియేటర్ల మీద దాడులకు పాల్పడ వద్దని అభిమానులకు సుదీప్ విన్నవించాడు. తన సినిమా విడుదల కోసం అభిమానుల్లాగే తానూ ఎదురు చూస్తున్నానని… ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటానని.. ఇంకొన్ని గంటలు ఎదురు చూడాలని అతను అభిమానులను కోరాడు. మరి శుక్రవారమైనా ఈ సినిమా సజావుగా రిలీజవుతుందేమో చూడాలి. ఈ చిత్రానికి సుదీపే కథ అందించగా.. శ్రద్ధాదాస్ హీరోయిన్గా నటించింది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…