ఒక స్టార్ హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర షోల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా రిలీజ్ కాలేదంటే వాళ్ల ఆగ్రహం మామూలుగా ఉండదు. దీనికి ఎవరు బాధ్యులు అని చూడకుండా.. థియేటర్ల మీద పడిపోతారు. ఇలా పలు సందర్భాల్లో థియేటర్లు ధ్వంసమైన అనుభవాలున్నాయి. అందులోనూ మాస్లో మంచి ఫాలోయింగ్ హీరోల సినిమాల విషయంలో ఇలా జరక్కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన సుదీప్.. తన కొత్త చిత్రం కోటిగొబ్బ-3 విషయంలో అలా జాగ్రత్త వహించలేకపోయాడు. ఈ సినిమాకు ఫైనాన్స్, ఇతర సమస్యల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ దాటి గురువారం విడుదలకు సిద్ధం చేశారు. తెల్లవారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా పడలేదు. మధ్యాహ్నానికి కూడా థియేటర్లు తెరుచుకోలేదు.
దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల దగ్గర సుదీప్ అభిమానులు గందరగోళం సృష్టించారు. చాలా చోట్ల థియేటర్ల మీద రాళ్లేశారు. స్టాఫ్ మీద దాడులకు దిగారు. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు. అభిమానులకు క్షమాపణ చెబుతూ.. కోటిగొబ్బ-3 గురువారం రిలీజ్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని.. శుక్రవారం కచ్చితంగా సినిమా రిలీజవుతుందని అతను క్లారిటీ ఇచ్చాడు.
అభిమానుల బాధను అర్థం చేసుకోగలనని.. ఐతే థియేటర్ల యాజమాన్యాలకు దీంతో ఏమాత్రం సంబంధం లేదని.. థియేటర్ల మీద దాడులకు పాల్పడ వద్దని అభిమానులకు సుదీప్ విన్నవించాడు. తన సినిమా విడుదల కోసం అభిమానుల్లాగే తానూ ఎదురు చూస్తున్నానని… ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటానని.. ఇంకొన్ని గంటలు ఎదురు చూడాలని అతను అభిమానులను కోరాడు. మరి శుక్రవారమైనా ఈ సినిమా సజావుగా రిలీజవుతుందేమో చూడాలి. ఈ చిత్రానికి సుదీపే కథ అందించగా.. శ్రద్ధాదాస్ హీరోయిన్గా నటించింది.
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…