ఒక స్టార్ హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర షోల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా రిలీజ్ కాలేదంటే వాళ్ల ఆగ్రహం మామూలుగా ఉండదు. దీనికి ఎవరు బాధ్యులు అని చూడకుండా.. థియేటర్ల మీద పడిపోతారు. ఇలా పలు సందర్భాల్లో థియేటర్లు ధ్వంసమైన అనుభవాలున్నాయి. అందులోనూ మాస్లో మంచి ఫాలోయింగ్ హీరోల సినిమాల విషయంలో ఇలా జరక్కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన సుదీప్.. తన కొత్త చిత్రం కోటిగొబ్బ-3 విషయంలో అలా జాగ్రత్త వహించలేకపోయాడు. ఈ సినిమాకు ఫైనాన్స్, ఇతర సమస్యల వల్ల రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ దాటి గురువారం విడుదలకు సిద్ధం చేశారు. తెల్లవారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జరిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా పడలేదు. మధ్యాహ్నానికి కూడా థియేటర్లు తెరుచుకోలేదు.
దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల దగ్గర సుదీప్ అభిమానులు గందరగోళం సృష్టించారు. చాలా చోట్ల థియేటర్ల మీద రాళ్లేశారు. స్టాఫ్ మీద దాడులకు దిగారు. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు. అభిమానులకు క్షమాపణ చెబుతూ.. కోటిగొబ్బ-3 గురువారం రిలీజ్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని.. శుక్రవారం కచ్చితంగా సినిమా రిలీజవుతుందని అతను క్లారిటీ ఇచ్చాడు.
అభిమానుల బాధను అర్థం చేసుకోగలనని.. ఐతే థియేటర్ల యాజమాన్యాలకు దీంతో ఏమాత్రం సంబంధం లేదని.. థియేటర్ల మీద దాడులకు పాల్పడ వద్దని అభిమానులకు సుదీప్ విన్నవించాడు. తన సినిమా విడుదల కోసం అభిమానుల్లాగే తానూ ఎదురు చూస్తున్నానని… ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటానని.. ఇంకొన్ని గంటలు ఎదురు చూడాలని అతను అభిమానులను కోరాడు. మరి శుక్రవారమైనా ఈ సినిమా సజావుగా రిలీజవుతుందేమో చూడాలి. ఈ చిత్రానికి సుదీపే కథ అందించగా.. శ్రద్ధాదాస్ హీరోయిన్గా నటించింది.
This post was last modified on October 14, 2021 9:52 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…