మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు రభస ఇప్పుడు కొంచెం సద్దుమణుగుతున్నట్లుగా ఉంది. రెండు రోజుల కిందట ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి మంచు విష్ణు ప్యానెల్, అలాగే మోహన్ బాబు మీద విమర్శలు, ఆరోపణలు చేశారు. దీనిపై ‘మా’తో ఇప్పుడు ఎలాంటి సంబంధం లేని నరేష్ స్పందించాడు కానీ.. మంచు విష్ణు, మోహన్ బాబు మాత్రం సైలెంటుగా ఉన్నారు. బుధవారం విష్ణు సైలెంటుగా ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై అతనెలా స్పందించబోయేది.. అధ్యక్షుడిగా వాటిపై ఏ నిర్ణయం తీసుకోబోయేది తెలియడం లేదు. దీనిపై అందరి దృష్టి నిలిచి ఉండగా.. విష్ణు తన తండ్రి మోహన్ బాబును వెంటబెట్టుకుని గురువారం నందమూరి బాలకృష్ణను కలవడం ఆసక్తి రేకెత్తించింది. ఆ కలయిక అనంతరం మోహన్ బాబు, విష్ణులిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య యన్.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్కు వ్యతిరేకంగా ప్రచారం చేశా. కానీ ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు” అని మోహన్ బాబు అన్నారు.
ఇక విష్ణు మాట్లాడుతూ.. బాలయ్య తనకు మొదట్నుంచి ఎంతో మద్దతుగా నిలిచారని.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే కలిశానని చెప్పాడు. ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నానని… ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నానని.. ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశానని.. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తానని విష్ణు చెప్పాడు.
This post was last modified on October 14, 2021 2:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…