Movie News

బాలయ్యను కలిశాక మోహన్ బాబు ఏమన్నారంటే..?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు రభస ఇప్పుడు కొంచెం సద్దుమణుగుతున్నట్లుగా ఉంది. రెండు రోజుల కిందట ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి మంచు విష్ణు ప్యానెల్, అలాగే మోహన్ బాబు మీద విమర్శలు, ఆరోపణలు చేశారు. దీనిపై ‘మా’తో ఇప్పుడు ఎలాంటి సంబంధం లేని నరేష్ స్పందించాడు కానీ.. మంచు విష్ణు, మోహన్ బాబు మాత్రం సైలెంటుగా ఉన్నారు. బుధవారం విష్ణు సైలెంటుగా ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలపై అతనెలా స్పందించబోయేది.. అధ్యక్షుడిగా వాటిపై ఏ నిర్ణయం తీసుకోబోయేది తెలియడం లేదు. దీనిపై అందరి దృష్టి నిలిచి ఉండగా.. విష్ణు తన తండ్రి మోహన్ బాబును వెంటబెట్టుకుని గురువారం నందమూరి బాలకృష్ణను కలవడం ఆసక్తి రేకెత్తించింది. ఆ కలయిక అనంతరం మోహన్ బాబు, విష్ణులిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు గారే నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశా. కానీ ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు” అని మోహన్ బాబు అన్నారు.

ఇక విష్ణు మాట్లాడుతూ.. బాలయ్య తనకు మొదట్నుంచి ఎంతో మద్దతుగా నిలిచారని.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే కలిశానని చెప్పాడు. ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నానని… ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నానని.. ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశానని.. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తానని విష్ణు చెప్పాడు.

This post was last modified on October 14, 2021 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

33 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago