Movie News

ప‌వ‌న్‌ను వ‌ద‌ల‌ని స‌త్యాగ్ర‌హి


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో మొద‌ట్నుంచి సామాజిక అంశాల ప్ర‌స్తావ‌న ఉండేది. రాజ‌కీయాల్లో అడుగు పెట్టడానికి ముందే సినిమాల ద్వారా కొంత మంచి చెప్ప‌డానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నించిన సంద‌ర్బాలున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌త్యాగ్ర‌హి అనే సినిమాను కూడా ప్ర‌క‌టించాడు ప‌వ‌న్.

జానీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్న ప‌వ‌న్.. ఆ త‌ర్వాత త‌న ఫేవ‌రెట్ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం.రత్నం ప్రొడ‌క్ష‌న్లో స‌త్యాగ్ర‌హి సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఘ‌నంగా చేశారు. దాని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఐతే ఏం జ‌రిగిందో ఏమో కానీ.. ఆ సినిమా ముందుకు క‌ద‌ల్లేదు. ప్రారంభోత్స‌వానికే ప‌రిమిత‌మై షూటింగ్ ద‌శ‌కు వెళ్ల‌లేదు. కానీ ఈ సినిమా గురించి అప్పుడ‌ప్పుడూ ప‌వ‌న్ ప్ర‌స్తావిస్తూనే ఉంటాడు. ఆ క‌థ ఆయ‌న్ని వెంటాడుతున్న‌ట్లే క‌నిపిస్తుంటుంది.

తాజాగా ప‌వ‌న్ మ‌రోసారి స‌త్యాగ్రహి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. స‌త్యాగ్ర‌హి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ షేర్ చేస్తూ ట్విట్ట‌ర్లో ఒక పోస్ట్ పెట్టాడు ప‌వ‌న్. ఎమ‌ర్జెన్సీ టైంలో జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ న‌డిపిన ఉద్య‌మ స్ఫూర్తిని ప్ర‌స్తుత కాలానికి అనుగుణంగా చెప్పాల‌న్న ఉద్దేశంతో అప్ప‌ట్లో ఈ సినిమాను మొద‌లుపెట్టామ‌ని.. 2003లో ప్రారంభోత్స‌వం జ‌రిపాక ఈ సినిమాను ఆపేశామ‌ని ప‌వ‌న్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాలో చేయాల‌నుకున్న‌ది నిజ జీవితంలో చేయాల‌న్న ఉద్దేశంతోనే సినిమాను ఆపేసిన‌ట్లు ప‌వ‌న్ చెప్ప‌డం విశేషం. సినిమాలో మాట‌ల‌తో చెప్ప‌డం కంటే నిజ జీవితంలో చేత‌ల్లో చూపించ‌డం ఎంతో సంతృప్తినిస్తుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు.

అంటే 2003లోనే ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం ఉంద‌న్న‌మాట‌. త‌న రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌తోనే ప‌వ‌న్ ఆ క‌థ రాసి సినిమా చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాడ‌న్న‌మాట‌. కానీ అందుకోసం సినిమా ఆపేయాల‌నుకోవ‌డంలో లాజిక్ ఏంట‌న్న‌దే అర్థం కావ‌డం లేదు.

This post was last modified on October 11, 2021 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago