పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మొదట్నుంచి సామాజిక అంశాల ప్రస్తావన ఉండేది. రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందే సినిమాల ద్వారా కొంత మంచి చెప్పడానికి పవన్ ప్రయత్నించిన సందర్బాలున్నాయి. ఈ క్రమంలోనే సత్యాగ్రహి అనే సినిమాను కూడా ప్రకటించాడు పవన్.
జానీ సినిమాతో దర్శకుడిగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న పవన్.. ఆ తర్వాత తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ప్రొడక్షన్లో సత్యాగ్రహి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా చేశారు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. ప్రారంభోత్సవానికే పరిమితమై షూటింగ్ దశకు వెళ్లలేదు. కానీ ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ పవన్ ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఆ కథ ఆయన్ని వెంటాడుతున్నట్లే కనిపిస్తుంటుంది.
తాజాగా పవన్ మరోసారి సత్యాగ్రహి ప్రస్తావన తెచ్చాడు. సత్యాగ్రహి ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు పవన్. ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ నడిపిన ఉద్యమ స్ఫూర్తిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా చెప్పాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ సినిమాను మొదలుపెట్టామని.. 2003లో ప్రారంభోత్సవం జరిపాక ఈ సినిమాను ఆపేశామని పవన్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాలో చేయాలనుకున్నది నిజ జీవితంలో చేయాలన్న ఉద్దేశంతోనే సినిమాను ఆపేసినట్లు పవన్ చెప్పడం విశేషం. సినిమాలో మాటలతో చెప్పడం కంటే నిజ జీవితంలో చేతల్లో చూపించడం ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ వ్యాఖ్యానించాడు.
అంటే 2003లోనే పవన్కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందన్నమాట. తన రాజకీయ ఆలోచనలతోనే పవన్ ఆ కథ రాసి సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడన్నమాట. కానీ అందుకోసం సినిమా ఆపేయాలనుకోవడంలో లాజిక్ ఏంటన్నదే అర్థం కావడం లేదు.
This post was last modified on October 11, 2021 9:12 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…